India Corona : 11,271 కొత్త కేసులు.. 11,376 రికవరీలు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11 వేల కేసులు

Updated : 14 Nov 2021 10:17 IST

17 నెలల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11 వేల కేసులు వెలుగులోకి రాగా.. మరణాల సంఖ్య 300లోపే నమోదైంది. రికవరీ రేటు మెరుగ్గా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో 12,55,904 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,271 కొత్త కేసులు బయటపడ్డాయి. వీటిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

* నిన్న ఒక్క రోజే కరోనాతో చికిత్స పొందుతూ 285 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,530కి చేరింది.

* గడిచిన 24 గంటల్లో 11,376 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి.. రికవరీ రేటు 98.26%కి పెరిగింది. మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం.

* ఇక క్రియాశీల కేసులు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 1,35,918(0.39 శాతం)కి తగ్గి 17 నెలల కనిష్ఠానికి చేరింది.

* మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మళ్లీ వేగం పుంజుకుంటోంది. నిన్న 57,43,840 మందికి టీకాలు అందించగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 112 కోట్లు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు