India-France: భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసాలు.. ఎప్పుడంటే!
పట్టణ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లపై దృష్టి సారించేలా భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్నాయి. ఫ్రాన్స్లోని ఫ్రెజుస్ ప్రాంతంలో నవంబర్ 15 నుంచి 26 వరకు ‘ఎక్సర్సైజ్ శక్తి 2021’ పేరుతో ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. ఇరు దేశాల ద్వైవార్షిక సంయుక్త విన్యాసాల్లో భాగంగా ఆరోసారి వీటిని
దిల్లీ: పట్టణ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లపై దృష్టి సారించేలా భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్నాయి. ఫ్రాన్స్లోని ఫ్రెజుస్ ప్రాంతంలో నవంబర్ 15 నుంచి 26 వరకు ‘ఎక్సర్సైజ్ శక్తి 2021’ పేరుతో ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆదేశాలతో భారత్, ఫ్రాన్స్ మధ్య సైనిక సహకారం పెంపొందించుకోవడంలో భాగంగా ఈ విన్యాసాలు జరగనున్నట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల ద్వైవార్షిక సంయుక్త విన్యాసాల్లో ఇది ఆరో ఎడిషన్.
భారత్ తరఫున గోర్ఖా రైఫిల్ బెటాలియన్ ఈ విన్యాసాల్లో పాల్గొనబోతుంది. గోర్ఖా రైఫిల్స్.. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఫ్రాన్స్ ఆర్మీ నుంచి 6వ లైట్ ఆర్మ్డ్ బ్రిగేడ్కు చెందిన 21వ మెరైన్ రెజిమెంట్ ప్రాతినిధ్యం వహించనుంది. భారత్, ఫ్రాన్స్ కలిసి భారత వాయు సేనతో ‘ఎక్సర్సైజ్ గరుడ’, నావికదళంతో ‘ఎక్సర్సైజ్ వరుణ’, సైనికదళంతో ‘ఎక్సర్సైజ్ శక్తి’ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. చివరగా 2019లో రాజస్థాన్లో ‘ఎక్సర్సైజ్ శక్తి’ విన్యాసాలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్