Vaccine: వ్యాక్సిన్ పాస్పోర్ట్.. వివక్షాపూరితం!
మనదేశంలో ఇప్పటి వరకు కేవలం మూడు శాతం మందికి మాత్రమే కరోనా టీకాలు అందిన నేపథ్యంలో ‘వ్యాక్సిన్ పాస్పోర్ట్’ ప్రతిపాదనను జీ-7 దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.
జీ-7 సదస్సులో స్పష్టం చేసిన భారత్
దిల్లీ: మనదేశంలో ఇప్పటి వరకు కేవలం మూడు శాతం మందికి మాత్రమే కరోనా టీకాలు అందిన నేపథ్యంలో ‘వ్యాక్సిన్ పాస్పోర్ట్’ ప్రతిపాదనను జీ-7 దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. జీ-7 దేశాల సదస్సుకు భారత్ను ఈసారి అతిథి హోదాలో ఆహ్వానించారు. భారత్ తరఫున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అందులో పాల్గొని మాట్లాడారు. వ్యాక్సిన్ల కొరతతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెమ్మదిగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటి ఇబ్బందుల్ని ఆయన లేవనెత్తారు.
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా తక్కువ మందికి టీకాలు అందినట్లు హర్షవర్ధన్ గుర్తుచేశారు. అలాగే అందరికీ టీకాలు అందించడం, టీకా పంపిణీ, సరఫరా, రవాణా, వ్యాక్సిన్ల సామర్థ్యం వంటి అంశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. అందువల్ల వ్యాక్సిన్ పాస్పోర్ట్ విధానాన్ని అమలు చేయడమంటే అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల వివక్ష చూపించడమేనని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి. అయితే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు టీకాలు అందించే విషయంపై ఈ సదస్సులో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. కొవిడ్-19ను ఎదుర్కొనే వ్యాక్సిన్లు సహా ఇతర ఔషధాల సామర్థ్యంపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్లు సమానంగా అందడం లేదనే సమస్యకు మాత్రం జీ-7 సదస్సు ఎలాంటి పరిష్కారం చూపలేకపోయింది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు కృషి చేద్దామంటూ చేతులు దులిపేసుకుంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే భవిష్యత్తులో వ్యాక్సిన్ పాస్పోర్టు విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన ఉంది. వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా ఓ ధ్రువపత్రం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యాప్లో ఉన్న ఆధారంతో విదేశీయుల్ని దేశంలోకి అనుమతించే విధానమే ‘వ్యాక్సిన్ పాస్పోర్ట్’. దీన్ని అమలులోకి తీసుకురావడంపై వివిధ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటి వరకు చాలామంది టీకాలు తీసుకున్నారు. వ్యాక్సిన్లు తయారీ దశలో ఉండగానే ఆయా దేశాలు టీకాలను భారీ ఎత్తున కొనుగోలు చేయడం వల్లే ఇది సాధ్యపడింది. కానీ పేద-మధ్యాదాయ దేశాల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భారత్ వంటి భారీ జనాభా కలిగిన దేశాల్లో ఇప్పటి వరకు 3 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. మరోవైపు అనేక ఆఫ్రికా దేశాలకు ఇంకా టీకాలు అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏకపక్షంగా వ్యాక్సిన్ పాస్పోర్ట్ విధానాన్ని అమలు చేయడం వల్ల కొన్ని దేశాలపై వివక్ష చూపినట్లవుతుందని భారత్ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం