India Population: తగ్గుతున్న భారత జనాభా.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే!
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశంగా పేరొందిన మన దేశంలో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందట. దశాబ్దాల కాలంగా కుటుంబ నియంత్రణపై కేంద్రం
దిల్లీ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశంగా పేరొందిన భారత్లో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందట. ఈ మేరకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 తాజా గణాంకాలు వెల్లడించాయి. 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇది. అంతేగాక, తొలిసారిగా సంతానోత్పత్తి రేటు (TFR).. రీప్లేస్మెంట్ రేటు కంటే దిగువకు పడిపోవడం ఓ మైలురాయి అని సర్వే చెబుతోంది.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ ఐదో ఎడిషన్ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలివిడత గణాంకాలను గతేడాది డిసెంబరులో బయటపెట్టగా.. రెండో విడత వివరాలను బుధవారం వెల్లడించారు. దీని ప్రకారం.. దేశంలో సంతానోత్పత్తి రేటు 2గా ఉంది. అంటే 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు సర్వే పేర్కొంది. అంతకు ముందు 2015-16లో నిర్వహించిన నాలుగో ఎడిషన్ సర్వేలో సంతానోత్పత్తి రేటు 2.2 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరింత తగ్గింది.
ఇక రీప్లేస్మెంట్ రేటు (సాధారణ స్థాయి భర్తీ రేటు) 2.1 కంటే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. రీప్లేస్మెంట్ రేటు అంటే జనాభాలో ఎటువంటి తగ్గుదల, పెరుగుదల ఉండకపోవడం. దేశంలో జనన, మరణాలను బ్యాలెన్స్ చేసే స్థాయిగా దీన్ని పేర్కొంటారు. ఇప్పుడు మన దేశంలో సంతానోత్పత్తి రేటు అంతకంటే తక్కువగా ఉండటంతో జనాభా తగ్గుదల మొదలైందని సర్వే చెబుతోంది. 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉంది. అంటే అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు. ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తోంది.
ఐదు రాష్ట్రాల్లో.. ఎక్కువగానే..
2019-21లో ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల సంతానోత్పత్తి రేటు 2 అంతకంటే తక్కువగానే ఉంది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్లలో మాత్రం ఇది ఇంకా రీప్లేస్మెంట్ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 2.4గా ఉండగా.. బిహార్లో 3గా తేలింది. దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు సిక్కింలో నమోదైంది. అక్కడ టీఎఫ్ఆర్ రేటు 1.1గా ఉంది. ఇక లద్దాఖ్లో సంతానోత్పత్తి రేటు ఐదేళ్లలో గణనీయంగా తగ్గి 2.3 నుంచి 1.3కు పడిపోయింది. అండమాన్ నికోబార్, గోవాల్లోనూ బర్త్ రేటు 1.3గా ఉంది.
ప్రతి నలుగురిలో ఒకరికి బాల్య వివాహం..
ఇక దేశంలో బాల్యవివాహాలు గతంలో కంటే తగ్గినప్పటికీ ఇంకా ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి ఇంకా 18 ఏళ్లు నిండకుండానే వివాహం జరుగుతోందని సర్వే గుర్తించింది. 18ఏళ్లు నిండకుండానే వివాహం చేసుకునే వారి సంఖ్య ఐదేళ్ల క్రితం 26.6శాతంగా ఉండగా.. 2019-21లో 23.3శాతానికి తగ్గింది. ఇక కుటుంబ నియంత్రణ సాధనాలు వాడే వారి సంఖ్య కూడా 54శాతం నుంచి 67శాతానికి పెరిగినట్లు సర్వే వెల్లడించింది. అయితే, ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.