Anthony Fauci: సంక్షోభ వేళ సైన్యాన్ని దించండి!
కరోనా వైరస్ వల్ల భారత్లో ఏర్పడ్డ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని రంగంలోకి దించడంతోపాటు అన్ని వనరులను వినియోగించుకోవాలని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు.
ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచన
వాషింగ్టన్: కరోనా వైరస్ వల్ల భారత్లో ఏర్పడ్డ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని రంగంలోకి దించడంతోపాటు అన్ని వనరులను వినియోగించుకోవాలని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ సూచించారు. వైరస్ ఉద్ధృతి, సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాల్లో సైన్యం సహాయంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేవలం వైద్య పరికరాలే కాకుండా సిబ్బంది కోసం ఇతర దేశాల సహాయాన్ని భారత్ తీసుకోవాలని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.
కొన్నివారాల లాక్డౌన్ అవసరం..!
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి తక్షణమే కొన్ని వారాల పాటు పూర్తి లాక్డౌన్ విధించాలని అమెరికా అధ్యక్షునికి ప్రధాన ఆరోగ్య సలహాదారుగా ఉన్న ఆంటోనీ ఫౌచీ పునరుద్ఘాటించారు. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి దేశాలు ఈ తరహా నిర్ణయాలతోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాయని అన్నారు. భారత్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలా చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో చేయడం వల్ల కరోనా సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయవచ్చని సూచించారు.
సైన్యం సహాయం అవసరమే..
ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు భారత్ తక్షణమే మధ్య, దీర్ఘకాలిక చర్యలు చేపట్టవచ్చని ఫౌచీ పేర్కొన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైన్యం సహాయంతో క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను నిర్మించుకోవాలని సూచించారు. గతేడాది చైనాకు సంక్షోభ సమయం ఎదురైనప్పుడు అత్యంత వేగంగా ఆసుపత్రులను నిర్మించడం, అందుకు అన్ని వనరులను వాడుకున్న సందర్భాన్ని గుర్తుచేశారు. యుద్ధ సమయాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా సైన్యం సహకారంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందన్నారు. తద్వారా అనారోగ్యంతో ఆసుపత్రి పడకలు అవసరమయ్యే బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని ఫౌచీ సూచించారు.
ప్రపంచ దేశాలు ముందుకు రావాలి..
దేశంలో రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర నుంచి నాలుగు లక్షలుగా ఉండడంతో భారత్ భయంకరమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అమెరికా మాదిరిగానే ఇతర దేశాలు కూడా భారీస్థాయిలో భారత్కు సహాయం అందించేందుకు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. వైద్యపరికరాలే కాకుండా సిబ్బందిని కూడా పంపించాలని అన్నారు. ప్రస్తుతం భారత్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనే విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా కొద్దీ ప్రతి ఒక్కరి సంరక్షణ చూసుకోవడం ఇబ్బందికరమని.. ఇలాంటి సమయంలో ఆక్సిజన్, వైద్య సదుపాయల కొరత ఏర్పడడం అసాధారణ పరిస్థితులకు దారితీస్తాయని చెప్పారు. అందుచేత సాధ్యమైనంత వరకు సహాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు ఫౌచీ పేర్కొన్నారు.
భారీ స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ అవసరం..
వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కట్టడికి చర్యలతోపాటే వ్యాక్సినేషన్ను కూడా భారీ స్థాయిలో చేపట్టాలని ఆంటోనీ ఫౌచీ సూచించారు. భారత్లో తయారవుతోన్న రెండు వ్యాక్సిన్లతో పాటే అమెరికా, రష్యా వంటి దేశాలు, వ్యాక్సిన్ సరఫరాకు ముందుకొచ్చే కంపెనీల నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించారు. అయితే, ఈ వ్యాక్సిన్ల వల్ల వచ్చే ఫలితాల్లో మరికొన్ని వారాల్లో కనిపిస్తాయని.. అందువల్ల ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొనసాగుతున్న ఆక్సిజన్, చికిత్స భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు.
ఇదిలాఉంటే, భారత్లో కరోనా కేసుల సంఖ్య 2కోట్ల మార్కును దాటగా.. 2లక్షల 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే భారత్లో జనాభాలో నాలుగో వంతున్న అమెరికాలో మాత్రం కేసుల సంఖ్య 3.2 కోట్ల మందిలో బయటపడగా, మరణాల సంఖ్య 5లక్షల 77వేలు దాటింది. అయితే, సరిపడ స్థాయిలోలేని ఆరోగ్య మౌలికసదుపాయాలు, బలహీన ఆర్థిక శక్తి, సెకండ్ వేవ్ ప్రభావం వల్ల భారీస్థాయిలో ఇన్ఫెక్షన్ పెరగడం వంటి సమస్యలతో పాటు ఆక్సిజన్, ఐసీయూ పడకల కొరత భారత్ను తీవ్రంగా వేధిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..