త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ: అమిత్షా
జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి..
దేశం చుట్టూ కంచెలు నిర్మిస్తామన్న హోం మంత్రి
దిల్లీ: జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( డీఆర్డీవో)తోపాటు కొన్ని ఏజెన్సీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. మరోవైపు సరిహద్దులను మరింత పటిష్ఠం చేసేందుకు 2022 నాటికి ఖాళీలు ఉన్న చోట కంచెలు నిర్మిస్తామన్నారు.
జమ్ములోని భారత వైమానిక స్థావరంపై జూన్ 27 జరిగిన డ్రోన్ దాడి ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. భవిష్యత్ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీలైనంత తొందరగా యాంటీడ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే డిమాండ్లు వినిపించాయి. ‘‘ డ్రగ్స్, మారణాయుధాలు, ప్రేలుడు పదార్థాలను సొరంగాలు, డ్రోన్ల ద్వారా అక్రమంగా రవాణా చేయడం ఇటీవల ఎక్కువైపోయింది. వీటిని గుర్తించడం కూడా పెద్ద సవాల్గా మారింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమించాలి. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్ టెక్నాలజీని దేశ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తామన్న నమ్మకం నాకుంది’’ అని బీఎస్ఎఫ్ సిబ్బందితో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా అన్నారు.
అత్యంత పటిష్ఠ భద్రతావలయంలో ఉండే వాయుసేన వైమానిక స్థావరంపై గత నెల 27న రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల (ఐఈడీ)ను జారవిడిచాయి. తొలి పేలుడుతో వైమానిక స్థావరంలోని ఓ భవనం పైకప్పుకు రంధ్రం ఏర్పడింది. రెండో బాంబు ఖాళీ ప్రదేశంలో పడింది. ఇద్దరు వాయుసేన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ డ్రోన్లు పాక్ నుంచే వచ్చాయని భారత్ వాదిస్తోంది. కానీ, దాయాది దేశం కొట్టిపారేస్తోంది. సరిహద్దుల్లో డ్రోన్లు ఉపయోగించడం ఆ దేశానికి కొత్త కాదు. గతంలోనూ చాలా సార్లు ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు ఉగ్రమూకలకు సరఫరా చేసేందుకు వీటిని ఉపయోగిస్తూ వచ్చింది. చాలా సార్లు పాక్ డ్రోన్లను భారత బలగాలు నేలకూల్చాయి కూడా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం