Mamata Banerjee: విగ్రహం సరే.. నేతాజీ మిస్టరీ సంగతేంటి?: కేంద్రాన్ని ప్రశ్నించిన దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజున తమ రాష్ట్ర శకటానికి అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజున తమ రాష్ట్ర శకటానికి అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించిన కేంద్రం.. అదే మహాత్ముడిపై తమ రాష్ట్రం రూపొందించిన శకటాన్ని తిరస్కరించి అన్యాయం చేసిందని మండిపడ్డారు. శకటాన్ని తిరస్కరించడానికి గల కారణాలనూ వెల్లడించలేదని తప్పుబట్టారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలో ఆదివారం ఆమె మాట్లాడారు. నేతాజీ శౌర్యాన్ని, పరాక్రమానికి అద్దంపట్టేవిధంగా సృజనాత్మకంగా తీర్చదిద్దిన శకటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా నేతాజీ అదృశ్యం విషయంలో మిస్టరీ గురించి కేంద్రాన్ని మమత ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయన మిస్టరీని ఛేదిస్తామని చెప్పిన భాజపా.. పూర్తిగా ఆ ప్రమాణాన్ని విస్మరించిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఈ విషయంలో ముందడుగు పడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేతాజీకి సంబంధించి డాక్యుమెంట్లన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా డిజిటలైజ్ చేశామని చెప్పారు. అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేయడాన్నీ మమత తప్పుబట్టారు. అమర జవాన్ జ్యోతిని ఆర్పివేసి.. నేతాజీ విగ్రహాన్ని నెలకొల్పి ఆ తప్పును కప్పిపుచ్చుకోలేరని విమర్శించారు. విగ్రహాలు, స్మారకాలతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.
సుభాష్ చంద్రబోస్, రిషి అరబిందో, వివేకానంద వంటి ఎందరో ప్రముఖుల ఆలోచనల నుంచి ప్రాణం పోసుకున్న సమాఖ్య వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మమత మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని, ఐఏఎస్ అధికారులను బెంగాల్ నుంచి దిల్లీకి రావాలంటూ సమన్లు జారీ చేస్తున్నారని, గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సైతం సమన్లు పంపారని గుర్తుచేశారు. దేశ చరిత్రను మార్చే, వక్రీకరించే యత్నాలను ప్రతిఘటించాలంటూ పార్టీ పేరును ప్రస్తావించకుండా ఈ సందర్భంగా మమత వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.