International Space Station: అంతరిక్ష కేంద్రంలో అనూహ్య పరిణామం!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రష్యా పంపిన కొత్త మాడ్యూల్.. కేంద్రానికి అనుసంధానమైన కొన్ని గంటల్లోనే అందులోని థ్రస్టర్లు అనుకోకుండా మండాయి....
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రష్యా పంపిన కొత్త మాడ్యూల్.. కేంద్రానికి అనుసంధానమైన కొన్ని గంటల్లోనే అందులోని థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో ఐఎస్ఎస్ దిశ అదుపు తప్పింది. అయితే, భూమిపై నుంచి ఐఎస్ఎస్ కదలికల్ని నిరంతరం పర్యవేక్షించే ‘గ్రౌండ్ కంట్రోల్ సిస్టం’ బృందం కొద్ది నిమిషాల్లోనే తిరిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా స్పష్టం చేసింది.
తొలుత సంబరాలు..
23 టన్నుల బరువుగల ‘నాకా’ అనే కొత్త మాడ్యూల్ను గతవారం కజఖ్స్థాన్లోని బైకనూర్ నుంచి రష్యా పంపింది. ఇది గురువారం ఐఎస్ఎస్కు అనుసంధానమైంది. ‘స్వయం అనుసంధాన వ్యవస్థ’ విఫలమవడంతో ఐఎస్ఎస్లోని రష్యా కాస్మోనాట్ ఓలెగ్ నొవిట్స్కీ మాన్యువల్గా నాకా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో భూమిపై ఉన్న రష్యా గ్రౌండ్ కంట్రోల్ బృందం సంబరాలు చేసుకుంది.
అంతలోనే..
కానీ, దాదాపు రెండు గంటల తర్వాత నాకాపై ఉన్న థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో అంతరిక్ష కేంద్రం దిశ అదుపు తప్పింది. ఐఎస్ఎస్ భ్రమణం సెకనుకు సగం డిగ్రీ చొప్పున మారింది. అలా ఐఎస్ఎస్ ఉండాల్సిన స్థితి కంటే 45 డిగ్రీలు అదనంగా వంగింది. అప్పటికే అప్రమత్తమైన రష్యా, అమెరికా గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. మరో రష్యా మాడ్యూల్ జ్వెజ్డా, ప్రోగ్రెస్పై ఉన్న థ్రస్టర్లను మండించారు. దీంతో ఒక గంట వ్యవధిలో ఐఎస్ఎస్ తిరిగి నిర్దేశిత స్థితికి చేరుకుంది. మరో 12 నిమిషాల పాటు భ్రమణం అలాగే కొనసాగి ఉంటే ఐఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేక దిశకు చేరుకునేదని నాసా వర్గాలు తెలిపాయి.
దిశ తప్పితే ఏమవుతుంది?
ఐఎస్ఎస్ నిర్దేశిత దశ, స్థితిలో లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానిపై ఉండే సౌర ఫలకలు(సోలార్ ప్యానెల్స్) నిత్యం సూర్యునికి అభిముఖంగా ఉండేలా ఐఎస్ఎస్ దిశ మారుతుంది. ఒకవేళ సౌర ఫలకలపై కిరణాలు పడకపోతే.. అంతరిక్ష కేంద్రంలో ఉండే ఇంధన వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల కేంద్రంలో కొన్ని వ్యవస్థల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే కేంద్రంలోని ఉష్ణోగ్రతలు సైతం అసాధారణంగా మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే అందులోని వ్యోమగాముల ఆరోగ్యం ప్రమాదంలో పడొచ్చు. అలాగే అక్కడి నుంచి గ్రౌండ్ కంట్రోల్ సిస్టంకు సంబంధాలు తెగిపోవచ్చు. గురువారం కొన్ని నిమిషాల పాటు వ్యోమగాముల నుంచి గ్రౌండ్ కంట్రోల్ సిస్టంకు సమాచార మార్పిడి నిలిచిపోయింది.
అయితే, ప్రస్తుతానికి ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములకు గానీ, కేంద్రానికి గానీ, ఎలాంటి డ్యామేజీ జరగలేదని నాసా తెలిపింది. దీనిపై మరింత సమీక్ష నిర్వహించాల్సి ఉందని పేర్కొంది. మరోవైపు రష్యా అంతరిక్ష కేంద్రం ‘రాస్కాస్మోస్’ ఈ అనూహ్య పరిణామానికి దారి తీసిన పరిస్థితిలపై సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM