పగ తీర్చుకుంటాం: ఇరాన్‌ వార్నింగ్‌

2020లో ఇరాన్‌ అగ్రశ్రేణి సైనికాధికారి మేజర్‌ జనరల్‌ సులేమానీపై డ్రోన్‌దాడి చేసి హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ కీలక నేత అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు.

Published : 22 Jan 2021 23:13 IST

ట్రంప్‌ ఫొటోమాంటేజ్‌తో ట్వీట్‌ చేసిన ఇరాన్‌ కీలక నేత

టెహ్రాన్‌: 2020లో ఇరాన్‌ అగ్రశ్రేణి సైనికాధికారి జనరల్‌ సులేమానీపై డ్రోన్‌దాడి చేసి హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ కీలక నేత అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఆయన ట్విటర్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ట్రంప్‌ ఫొటోమాంటేజ్‌ (సృష్టించిన చిత్రం) పెట్టి దానిపై 2020 డ్రోన్‌ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం అని రాసి ఉన్న చిత్రాన్నిఉంచారు. ఆ ఫొటో మాంటేజ్‌లో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా, పై నుంచి యుద్ధవిమానాలు వెళ్తున్నట్లుగా ఉంది. ‘ జనరల్‌ సులేమానీని హత్య చేసినవారు, దానికి ఆదేశాలిచ్చినవారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం.’ అని ఆయన ఆ పోస్టులో  పేర్కొన్నారు.

గతేడాది జనవరి 3న ఇరాక్‌లోని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరిగింది. ఆ దాడిలో ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్‌ మరణించారు. అనంతరం ఆ దాడిని తామే చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ వెల్లడించింది. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకే ఆ దాడి జరిపినట్లు వారు ప్రకటించారు. కాగా అమెరికా చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ గట్టి హెచ్చరికలే చేసింది. బుధవారం అమెరికా అధ్యక్షుడిగా తన బాధ్యతలకు వీడ్కోలు పలికి ట్రంప్‌ వైట్‌ హౌస్‌ను వీడారు. ఈ సమయంలో డ్రోన్‌ దాడి అంశంపై ఇరాన్‌ కీలక నేత ట్వీట్‌ పెట్టడం గమనార్హం.

ఇవీ చదవండి..

సమర్ధవంతంగా కొవాగ్జిన్‌: లాన్సెట్‌ పరిశీలన

ట్రంప్‌తో సంభాషణా? ఇప్పట్లో లేదు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని