లాలూ ప్రసాద్‌కు మళ్లీ నిరాశ 

ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం......

Published : 19 Feb 2021 18:57 IST

రాంచీ: ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మరో రెండు నెలల తర్వాత మళ్లీ కొత్తగా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. లాలూ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డుమ్కా ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమ ఉపసంహరణకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఆయనపై కేసు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి జాయింట్‌ అఫిడవిట్‌, లాలూ జ్యుడీషియల్‌ కస్టడీ పత్రాలను సీబీఐ గతేడాది డిసెంబర్‌లో కోర్టుకు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాఖలైన బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 12న విచారించిన న్యాయస్థానం.. శుక్రవారానికి వాయిదా వేసింది. దాణా కుంభకోణం కేసులో అరెస్టైన లాలూ 2017 డిసెంబర్‌ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల లాలూ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయన్ను రాంచీలోని రిమ్స్‌ నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. లాలూ కిడ్నీ 25శాతం మాత్రమే పనిచేస్తున్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. ఈ నేపథ్యంలో లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 50వేల పోస్టు కార్డులను పంపారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి తన తండ్రిని విడుదల చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని