Corona: కేరళలో భారీగా కొవిడ్ కేసులు.. ఆదివారాల్లో అత్యవసర సేవలకేఅనుమతి!
దేశంలో కరోనా మహమ్మారి ఉరుముతోంది. ఒమిక్రాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలో గతంలో ఎన్నడూ లేనంతగా ......
తిరువనంతపురం: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి ఉరుముతోంది. ఒమిక్రాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలో గతంలో ఎన్నడూ లేనంతగా కొవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల టెస్టులు చేయగా.. 46,387 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పట్నుంచి అక్కడ ఇంత భారీగా రోజువారీ కేసులు రావడం ఇదే తొలిసారి. గతేడాది మే 12న అత్యధికంగా 43,529 కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
కొత్త కేసులతో కలుపుకొంటే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 54,87,898కి పెరిగింది. మరోవైపు, కొవిడ్ బాధితుల్లో 341 మంది మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,501కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,99,041గా ఉంది. తిరువనంతపురంలో అత్యధికంగా 9,720 కొత్త కేసులు రాగా.. ఎర్నాకుళంలో 9605, కోలికోడ్ 4016 చొప్పున కొవిడ్ కేసులు వచ్చాయి. మరోవైపు, కేరళలో ఒమిక్రాన్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. కొత్తగా మరో 62 ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో అక్కడ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 707కి పెరిగినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఆదివారాల్లో అత్యవసరసేవలకే అనుమతి!
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మరింత అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు ప్రకటించింది. వైద్యం కోసం అమెరికా వెళ్లిన సీఎం పినరయి విజయన్ అక్కడి నుంచే అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండు ఆదివారాల్లోనూ పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించనుంది. ఈ నెల 23, 30 తేదీల్లో అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించనున్నారు. రెండేళ్ల లోపు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులతో పాటు క్యాన్సర్ రోగులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వర్క్ఫ్రం హోం సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. వాణిజ్య సముదాయాలు, మాల్స్, బీచ్లు, పార్కులు వంటి పర్యాటక ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆదివారాల్లో మాల్స్, సినిమా థియేటర్లు మూసి ఉంచనున్నారు. అలాగే, అన్ని తరగతులనూ ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో నమోదైన కేసుల ఆధారంగా జిల్లా అధికార యంత్రాంగాలు కొత్త ఆంక్షలు అమలుచేసేందుకు అవకాశం కల్పించారు.
కేసుల తీవ్రత, ఆస్పత్రిపాలైన వారి సంఖ్యను బట్టి రాష్ట్రంలోని జిల్లాలను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి ఆంక్షలు అమలుచేయనున్నారు. తిరువనంతపురంతో పాటు పాలక్కడ్, ఇడుక్కి, వయనాడ్ జిల్లాలు కేటగిరీ -బిగా విభజించారు. ఆయా జిల్లాల్లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన, బహిరంగ సమావేశాలకు అనుమతిలేదు. మత సంబంధమైన కార్యక్రమాలు ఆన్లైన్లో మాత్రమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. వివాహాలు, అంత్యక్రియలు వంటి సామాజిక కార్యక్రమాలకు 20మంది మించరాదని స్పష్టంచేశారు. అలాగే, ఎర్నాకుళం, కొల్లం, అళప్పుజ కేటగిరీ- ఏ జిల్లాలు. ఆ జిల్లాల్లో పైన పేర్కొన్న కార్యక్రమాలకు 50మందికి మించరాదు. సీ- కేటగిరీలో ఇప్పటివరకు ఏ జిల్లాలనూ చేర్చలేదు. అక్కడ జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్కు అనుమతిలేదు. వివాహాలు, అంత్యక్రియలకు కేవలం 20మంది వరకే అనుమతించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్