కరోనా ఎఫెక్ట్: 2 రోజుల్లో.. 2.5 లక్షల పరీక్షలు
తిరువనంతపురం : కొవిడ్ ఉద్ధృతి దేశంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఎక్కడ నుంచి సోకుతుందో తెలియకుండానే వేల సంఖ్యలో జనాలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సోకిన వ్యక్తులను ఒడిసి పట్టి, వైరస్ వ్యాప్తికి ఎక్కడికక్కడ అడ్డుకట్టే వేసేందుకు చర్యలకు ..
కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం : కొవిడ్ ఉద్ధృతి దేశంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఎక్కడ నుంచి సోకుతుందో తెలియకుండానే వేల సంఖ్యలో జనాలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సోకిన వ్యక్తులను గుర్తించి, వైరస్ వ్యాప్తికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 16, 17 తేదీల్లో రెండున్నర లక్షల కొవిడ్ పరీక్షలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కొవిడ్ ఉద్ధృతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం పినరయి విజయన్ గురువారం ఈ నిర్ణయం ప్రకటించారు.
విస్తృత పరీక్షలు, కఠిన నియంత్రణ, టీకాల పంపిణీలో భాగంగా దీన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. టెస్టులకు సంబంధించి జిల్లా యంత్రాంగం లక్ష్యాలు నిర్దేశించుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యోగులతో పాటు ప్రజా రవాణా, సేవ, వైద్య రంగాల్లోని సిబ్బందికి విధిగా కొవిడ్ పరీక్షలు చేయాలని చెప్పారు. అలాగే కిరాణా దుకాణాలు, హోటళ్లు, మార్కెట్లలోని వారు సైతం పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మరోవైపు వివాహాలతో పాటు ప్రజా సంబంధిత కార్యక్రమాలకు అనుమతి పొందడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కాగా, కేరళలో ఇవాళ ఒక్కరోజే 8,778 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 2,642 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 26 మంది వైరస్తో మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)