అధికార పార్టీ సెక్రటరీగా కిమ్: విషయమేంటంటే..
ఉత్తర కొరియా అధికార పార్టీ జనరల్ సెక్రటరీగా కిమ్ జోంగ్ ఉన్ ఎన్నికయ్యారు.
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధికార వర్కర్స్ పార్టీ ఎనిమిదవ కాంగ్రెస్ సమావేశం రాజధాని ప్యాంగ్యాంగ్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన ఎన్నికల్లో.. పార్టీ జనరల్ సెక్రటరీగా కిమ్ జోంగ్ ఉన్ ఎన్నికయ్యారు. సమావేశాల ఆరో రోజు ఐన ఆదివారం ఈ ‘ఎన్నిక’ నిర్వహించినట్టు ఆ దేశ అధికార మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ (కేసేఎన్ఏ) వెల్లడించింది.
దేశానికి అమూల్యమైన సేవలందించిన నేతల పట్ల గౌరవ సూచకంగా ఉత్తర కొరియా.. కిమ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ను ‘శాశ్వత ప్రధాన కార్యదర్శి’గా, కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ను ‘శాశ్వత అధ్యక్షుడి’గానూ ప్రకటించింది. అంటే మరణానంతరం కూడా వారు ఈ పదవుల్లో కొనసాగుతున్నారన్నమాట. 2011లో తండ్రి మరణానంతరం.. కిమ్ జోంగ్ ఉన్ అధికార పగ్గాలు చేపట్టారు. 2012లో వర్కర్స్ పార్టీ ఆయనను పార్టీ అధినేత లేదా ఫస్ట్ సెక్రటరీగా నిర్ణయించింది. కాగా, తాజా ఎన్నికల ఫలితంగా.. జనరల్ సెక్రటరీ పదవి కిమ్ వశమైంది.
చెల్లికి మొండిచేయి
ప్రస్తుత సమావేశాల్లో అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీలో వివిధ పదవులకు కూడా నేతలను ఎన్నుకున్నారు. ఐతే అంచనాలకు విరుద్ధంగా.. పార్టీ ముఖ్య నేత, కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ పేరు ఈ జాబితాలో చోటుచేసుకోకపోవటం గమనార్హం. తన అధికార పీఠాన్ని మరింత దృఢం చేసుకునేందుకే కిమ్ ఈ విధంగా పావులు కదిపినట్టు.. ఏకవ్యక్తి పాలన సాగే ఉత్తర కొరియా రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న పలువురు భావిస్తున్నారు.
పార్టీ ఎగ్జిక్యూటివ్ పోలిట్ బ్యూరో లేదా సెక్రటేరియట్ వ్యవస్థను ఉత్తర కొరియా 2016లో రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ దీనిని పునరుద్ధరించాలన్న ఆలోచనలో ఉన్న అధికార పార్టీ.. అందుకు అనుగుణంగా నిబంధనలను మార్చే విషయమై చర్చలు జరుపుతోంది. దేశ మార్గదర్శనానికి, సమైక్యతను సాధించేందుకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంగా పార్టీ ప్రతినిధులు దీనిని అభివర్ణించారు. సోమవారం కూడా ఈ సమావేశం కొనసాగనున్నట్టు ఆ దేశ మీడియా సంస్థ ప్రకటించింది. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో దౌత్య, ఆర్థిక, రక్షణ పరమైన కీలక నిర్ణయాలను గురించి చర్చలు కొనసాగుతాయని తెలిపింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం