Kim Sister: అమెరికాతో చర్చల్లేవ్..!
అమెరికాతో సంప్రదింపులు పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా నియంత కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) స్పష్టం చేశారు.
అమెరికాపై మండిపడ్డ కిమ్ సోదరి
సియోల్: అమెరికాతో సంప్రదింపులు, ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలని ఉత్తరకొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ (Kim Jong Un) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయని అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై తాజాగా స్పందించిన కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo Jong).. అమెరికాతో సంప్రదింపులు పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలకు తావులేదన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయంటూ అమెరికా వేస్తోన్న అంచనాలు.. వారిని మరింత నిరాశకు గురిచేస్తాయని అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా వ్యవహారాలను పర్యవేక్షించే అమెరికా దౌత్యవేత్త సంగ్ కిమ్, దక్షిణ కొరియాలో పర్యటిస్తోన్న నేపథ్యంలో కిమ్ సోదరి ఈ విధంగా స్పందించినట్లు అక్కడి అధికారిక వార్తా సంస్థ KCNA వెల్లడించింది.
అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ‘చర్చలకైనా.. ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలి’ అని తన సైన్యానికి కిమ్జోంగ్ ఉన్ ఈమధ్యే సూచించారు. దీనిపై స్పందించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలైవాన్, కిమ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. అయితే వీటిపై మరింత స్పష్టమైన సంకేతాలు వచ్చేవరకు వేచిచూస్తామని.. తాము మాత్రం ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అమెరికా భావించింది. కానీ, ఉత్తరకొరియా నియంత సోదరి మాత్రం చర్చల పునరుద్ధరణకు తావులేదని స్పష్టం చేయడం గమనార్హం.
అమెరికాలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కిమ్ సర్కారు మాత్రం ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా అణుపరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని ఉత్తర కొరియా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాతో అమెరికా చేస్తోన్న సైనిక విన్యాసాలు, శత్రువిధానాలను విడిచిపెట్టడంపైనే అమెరికాతో దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని తేల్చి చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!