రాత్రి కర్ఫ్యూ.. అమలవుతున్న రాష్ట్రాలివే..
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. మొదటి దశ కంటే.. రెండో దశలో కేసులు భారీగా
దిల్లీ : దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. మొదటి దశ కంటే.. రెండో దశలో కేసులు భారీగా నమోదవుతుండటంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు, లాక్డౌన్ల దిశగా కదులుతున్నాయి. కఠిన చర్యలు చేపడుతూ వైరస్కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజాగా హరియాణాలో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక భోపాల్లో ఏడు రోజుల రాత్రి కర్ఫ్యూకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 19 వరకూ ఇది అమల్లో ఉండనుంది.
దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్న రాష్ట్రాలివే..
మహారాష్ట్ర
* దేశంలో కొవిడ్కు ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్రనే. దేశవ్యాప్తంగా నమోదువుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. ఇక్కడ కొన్ని రోజులుగా నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. రోజూ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. వారాంతాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ తీసుకువచ్చింది. పరిస్థితి అదుపులోకి రాకపోతే త్వరలో పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా ఇక్కడ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్
* సోమవారం నుంచి ఏప్రిల్ 19 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ
* బర్వానీ, రాజ్గఢ్, విదీషా జిల్లాల్లో ఈ నెల 19 వరకూ లాక్డౌన్
* బాలాఘాట్, నర్సింగ్పూర్, సియోనీ, జబల్పూర్లో ఏప్రిల్ 22 వరకూ 10 రోజుల లాక్డౌన్
ఉత్తరప్రదేశ్
* మథుర, గోరఖ్పూర్, లఖ్నవూ, కాన్పూర్, గౌతమ్ బుద్ధానగర్, అలహాబాద్, మేరఠ్, ఘజియాబాద్, బరేలీ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ
కర్ణాటక
* రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో 11 రోజుల రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏప్రిల్ 10 నుంచి 20 వరకూ బెంగళూరు, మైసూర్, మంగళూరు, బీదర్, తుమకూర్, ఉడుపి ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ.
దిల్లీ
* ఏప్రిల్ 30 వరకూ దిల్లీలో రాత్రి కర్ఫ్యూ.
హరియాణా
* రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
జమ్ముకశ్మీర్
* ఎనిమిది జిల్లాల్లో(జమ్ము, శ్రీనగర్, ఉధంపూర్, బారాముల్లా, కథువా, అనంత్నాగ్, బుడ్గామ్, కుప్వారా) రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకూ కర్ఫ్యూ.
రాజస్థాన్
* అజ్మేర్, అల్వార్, భిల్వారా, చిత్తోర్గఢ్, దుంగార్పూర్, జైపుర్, జోధ్పూర్, కోటా తదితర ప్రాంతాల్లో ఏప్రిల్ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ
గుజరాత్
* జామ్నగర్, భావ్నగర్, జునాగఢ్, గాంధీనగర్, ఆనంద్, నదియాడ్, మోర్బీ, దహోడ్, పఠాన్, భుజ్, గాంధీధామ్, భరూచ్, సూరత్, అహ్మదాబాద్, రాజ్కోట్, వడోదరలో ఏప్రిల్ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ
పంజాబ్
* రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది.
ఒడిశా
* సుందర్భాగ్, ఝార్సుగూడ, సంబల్పూర్, బర్గాఢ్, నౌపడ, కలాహండి, కోరాపుత్, మల్కన్గిరిలో రాత్రి కర్ఫ్యూ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ