Ayodhya: ఉచితంగా విమాన ప్రయాణం చేసి అయోధ్య చూడాలనుందా?

 శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యని సందర్శించాలనుకునే వారికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో జరిగిన క్విజ్‌ పోటీలను రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఉషా ఠాకూర్‌ ప్రారంభించారు.

Updated : 24 Nov 2022 14:53 IST

‘రామాయణ’ క్విజ్‌లో విజేతలుగా నిలవండి
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం

భోపాల్‌:  శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యని సందర్శించాలనుకునే వారికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో జరిగిన క్విజ్‌ పోటీలను రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఉషా ఠాకూర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ‘‘ మధ్యప్రదేశ్ ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హిందూ ఇతిహాసం ‘రామాయణం’ క్విజ్‌షోను ఏర్పాటు చేస్తోంది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యని ఉచిత విమాన ప్రయాణం ద్వారా సందర్శించవచ్చు. త్వరలోనే పోటీతేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు.

రామ్‌ చరిత్‌ మానస్‌ ఇప్పుడొక సబ్జెక్ట్‌..
ఆర్ట్‌ స్ర్టీమ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సును అభ్యసించే మొదటి సంవత్సరం విద్యార్థులు ‘‘రామ్‌చరిత్‌మానస్‌’’ను ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చని మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా.. ‘రామ్ వాన్ గమన్ పథ్’ టూరిజం ప్రాజెక్ట్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో కోటి రూపాయలు కేటాయించింది. రాముని వనవాస మార్గాన్ని భక్తులు వీక్షించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని