china: తరిమిన మలేషియా.. తుడిచేసుకొన్న చైనా..!
దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలు మలేషియా దాకా వ్యాపించాయి. ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్
రంగంలోకి దిగిన ఫైటర్ జెట్లు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలు మలేషియా దాకా వ్యాపించాయి. ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి ప్రాంతాలకే పరిమితమైంది. చైనా యుద్ధవిమానాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో మలేషియా కూడా ఫైటర్ జట్ విమానాలను రంగంలోకి దింపి వాటిని తరమాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఒక్కసారి దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన భూభాగానికి సుదూరంగా ఉన్న మలేషియా వద్ద సముద్ర జలాలు కూడా తనవే అని చైనా ప్రకటించుకోవడం వివాదానికి మూలకారణం అయ్యింది.
ఏమి జరిగింది..
మలేషియాలోని సార్వాక్ ప్రాంతంలో సముద్ర జలాలపై సోమవారం 16 చైనా యుద్ధవిమానాలు ప్రయాణించాయి. ఈ యుద్ధవిమానాలు వ్యూహాత్మక ఫార్మేషన్లో ప్రయాణించడం మలేషియాను మరింత కలవరపర్చింది. సార్వాక్కు 110 కిలోమీటర్ల దూరం (60నాటికల్మైళ్లు)లో 27,000 అడుగుల ఎత్తున ప్రయాణించాయి. బోర్నియో ద్వీపం నుంచి మలేషియా అధికారులు ఈ విమానాలతో కమ్యూనికేషన్లోకి వచ్చి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా పట్టించుకోకపోవడంతో మలేషియా వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలు లబౌన్ ఎయిర్బేస్ నుంచి గాల్లోకి ఎగిరాయి. మధ్యాహ్నం 1.33 సమయంలో వాటిని వెనక్కి వెళ్లిపొమ్మని సంకేతాలు పంపాయి. ఆ వచ్చిన విమానాల్లో ఇల్యూషన్ ii-76, షియాన్ వై20 రవాణా విమానాలు ఉన్నాయి. ఈ అంశాన్ని మలేషియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
చైనా దౌత్యవేత్తకు సమన్లు..
ఈ ఘటనను మలేషియా సార్వభౌమాధికారానికి బెదిరింపులుగా అభివర్ణించింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆ దేశంలోని చైనా రాయబారికి సమన్లు జారీ చేసింది. ‘‘ఏ దేశంతో అయినా మేము స్నేహపూర్వకంగా ఉన్నామంటే దానర్థం మా దేశ సార్వభౌమాధికారాన్ని వదులుకుంటామని కాదు’’ అని మలేషియా వ్యాఖ్యానించింది.
దీనిపై కౌలాలంపూర్లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. అది చైనా వాయుసేన సాధనలో భాగంగా జరిగిందని పేర్కొంది. తాము అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడే గగనతలంలో ప్రయాణించామని.. ఏదేశ ప్రాదేశిక గగనతలంలోకి చొరబడలేదని సమర్థించుకొంది. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి మలేషియాలో స్నేహపూర్వక సంబంధాలు నెరపడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. గతేడాది కూడా చైనాకు చెందిన ఒక సర్వే నౌక మలేషియా జలాల్లో తిష్టవేసుకొంది. ఆ వివాదం చల్లారడానికి దాదాపు నెలరోజులు పట్టింది.
ఇటీవలే ఫిలిప్పీన్స్తో వివాదం..
మార్చి 7వ తేదీన వివాదాస్పద జూలియన్ ఫిలిప్పే ద్వీపం వద్దకు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలివచ్చాయి. చైనా చేపలవేట ఓడలు చిన్నసైజు యుద్ధనౌకలను తలపిస్తుంటాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతు ఉంది. ఫిలిప్పీన్స్కు చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోనే ఈ ద్వీపం ఉంటుంది. అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనాతో స్నేహంగా ఉండేందుకు.. వీలైనంత ఉదాసీనంగా వ్యవహరించారు. మరోపక్క రక్షణ భాగస్వామిగా ఉన్న అమెరికాతో ఒప్పందాలను రద్దు చేసుకొనేందుకు కూడా డ్యుటెరెట్టి ఒక దశలో ప్రయత్నించారు. అయినా డ్రాగన్ మారకపోవడంతో ఫిలిప్పీన్స్ విసిగిపోయింది.
మే 3వ తేదీన ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ మంత్రి టియోడోరో లోక్సిన్ చైనాపై ట్విటర్లో విరుచుకుపడ్డారు. రాయలేని పదాలతో బూతులు అందుకొన్నారు. ఈ ట్వీట్ల పరంపర అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. దీనిపై చైనా స్పందిస్తూ.. కనీసం దౌత్య భాష వాడితే మేము స్పందిస్తామంటూ పేర్కొంది. అంతేకానీ ఆ నౌకలను వెనక్కి పిలవలేదు. గత వారం ఫిలిప్పీన్స్ మరోసారి దౌత్య నిరసన వ్యక్తం చేసింది. 2016లో డ్యుటెరెట్టి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇది చైనాకు వ్యతిరేకంగా చేపట్టిన 84వ దౌత్య నిరసన..! చైనా ముప్పును గ్రహించిన ఫిలిప్పీన్స్ ఈ ప్రాంతంలో గస్తీని విపరీతంగా పెంచింది. మార్చి 1 నుంచి మే 25 వరకు స్పార్ట్లీ ద్వీపాల వద్దకు 53సార్లు గస్తీ దళాలను పంపింది.
సముద్రాన్నే మింగేంత దాహం..!
దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్, బ్రునై, మలేషియా వంటి దేశాలున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి. తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల దూరం వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కిందకు వెళతాయి. అంటే సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ 200 నాటికల్ మైళ్ల దూరం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆ దేశానికి దక్కుతుంది. ఈ లెక్కన చైనాకు తనది చెప్పుకొనే సముద్రంలో అతి తక్కువ భాగమే దక్కుతుంది. కానీ డ్రాగన్ దక్షిణ చైనా సముద్రాన్నే మింగేయాలనుకుంటోంది. ఇక్కడ భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. దీంతో వీటిని సొంతం చేసుకోవడం కోసం ఇక్కడి చాలా దీవులు తనవే అని చెబుతోంది. వీటిల్లో స్పార్ట్లీ దీవులు కీలకమైనవి. వీటిని దక్కించుకోవడానికి ఒక దీవిని కృత్రిమంగా తయారు చేసి అక్కడ తన యుద్ధవిమానాలను మోహరించింది. అంతేకాదు ఈ మార్గంలో ఏటా మూడు ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకులను రవాణా చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!