2-డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్ కోసం డీఆర్డీవో నుంచి తమకు అనుమతి లభించినట్టు .......
దిల్లీ: కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్ కోసం డీఆర్డీవో నుంచి తమకు అనుమతి లభించినట్టు మ్యాన్కైండ్ ఫార్మా వెల్లడించింది. గ్వాలియర్లోని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్డీఈ) ఈ ఔషధాన్ని తయారు చేయగా.. డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ల్యాబోరేటరీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీలలో క్లినికల్ ట్రయల్స్ జరిగాయని మ్యాన్కైండ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ డ్రగ్ను విశాఖపట్నం, హిమాచల్ప్రదేశ్లలోని తమ యూనిట్లలో ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది. మధ్యస్థ నుంచి తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించినట్టు మ్యాన్కైండ్ ఫార్మా తెలిపింది. ఆస్పత్రిపాలైన కరోనా రోగులు త్వరగా కోలుకొనేందుకు దోహదం చేయడంతో పాటు ఆక్సిజన్పై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుందని తేలినట్టు ప్రకటనలో పేర్కొంది. దేశంలో కరోనా బారినపడిన రోగులకు విస్తృతంగా ఈ ఔషధాన్ని చేరవేయాలన్న లక్ష్యంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది.
2-డీజీ ఔషధానికి మనదేశంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీఆర్డీఓ భాగస్వామ్యంతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈ ఔషధాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ మందు లభ్యత ఇంకా పరిమితంగానే ఉండటంతో దాన్ని పెంచేందుకు ఇతర కంపెనీలను సైతం ప్రోత్సహించాలని డీఆర్డీఓ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల శిల్పా మెడికేర్కు ఉత్పత్తి చేసేందుకు అనుమతించిన డీఆర్డీవో.. తాజాగా మ్యాన్కైండ్ ఫార్మాకు కూడా అనుమతి మంజూరు చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని