దండకారణ్యంలో దడ
దట్టమైన కీకారణ్యం.. కొండలూ, గుట్టలతో నిండి ఉండటం.. స్థానిక గిరిజనుల నుంచి మద్దతు..
రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఘటనలు
హైదరాబాద్: దట్టమైన కీకారణ్యం.. కొండలూ, గుట్టలతో నిండి ఉండటం.. స్థానిక గిరిజనుల నుంచి మద్దతు.. దండకారణ్యంలో మావోయిస్టుల పెత్తనం కొనసాగడానికి ఇవీ కొన్నికారణాలు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని కట్టడి చేయగలిగినప్పటికీ.. దండకారణ్యం మాత్రం తన విభిన్నతలతో ప్రభుత్వాలకు కొరుకుడు పడటంలేదు. మావోయిస్టుల తాజా మెరుపుదాడి నేపథ్యంలో దేశం దృష్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని ఈ కీకారణ్యంపైనే కేంద్రీకృతమైంది. ఇది రాష్ట్రానికి ఆనుకొని ఉండటం, అటువైపు నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా మావోయిస్టులు రాష్ట్రంలోకి జొరబడుతుండటం, అన్నింటికీ మించి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా అనేక మంది తెలుగువారే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అంశం రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
దేశంలో గత పదేళ్లలో వామపక్ష తీవ్రవాదం తాలూకూ హింస చాలావరకూ తగ్గింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2010లో దేశంలో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి 2,213 హింసాత్మక ఘటనలు జరగ్గా 1,005 మంది మరణించారు. 2019 నాటికి ఘటనలు 670కి, మరణాలు 202కి తగ్గాయి. అప్పట్లో మొత్తం పది రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ మినహా మిగతా రాష్ట్రాల్లో వామపక్ష కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నాయి. తీవ్రవాదంపై పోరులో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలు చాలా పరిమితమయ్యాయి. ఛత్తీస్గఢ్లో 2010లో 625 ఘటనలు, 343 మరణాలు సంభవిస్తే 2019 నాటికి అవి వరుసగా 263, 77కు చేరుకున్నాయి. ఇక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడానికి ప్రధాన కారణం దండకారణ్యమే. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. మిగతా రాష్ట్రాల నుంచి బలగాలను ఉపసంహరించి ఛత్తీస్గఢ్కు పంపుతోంది. దండకారణ్యంలో పరిస్థితి అదుపులోకి రాకపోతే దీని ప్రభావం మిగతా రాష్ట్రాలపైనా ఉంటుందనడంలో సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఎలా ఉందో చెప్పడానికి దండకారణ్యమే కొలమానంగా మారింది. తమకు పెట్టనికోటలా మారిన ఈ అరణ్యంలో తిష్టవేసిన మావోయిస్టులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఇటీవలి ఘటన తరహాలో మెరుపుదాడులకు దిగుతున్నారు. మిగతా రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లడంతోపాటు ఆయా రాష్ట్రాల క్యాడర్ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త నియామకాలపై దృష్టి పెట్టి, ఆకర్షితులైన వారికి శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్ నియామకాల కోసమే ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలాకాలం సంచరించాడు. పోలీసులు అప్రమత్తమయ్యే సరికి మళ్లీ దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఎప్పుడైనా ముప్పు ముంచుకు రావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సరిహద్దుల్లో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వామపక్ష తీవ్రవాదం కట్టడిలో అనుభవం ఉన్న సిబ్బందిని ఇక్కడ ప్రత్యేకంగా నియమించారు. అయితే ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలుగానే పనికి వస్తాయి తప్ప ముప్పుని పూర్తిస్థాయిలో నివారించలేవనే భావన వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే