Maoist: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్య.. 12 వాహనాలకు నిప్పు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్‌, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో 12

Updated : 22 Jan 2022 10:18 IST

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్‌, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు. బాంబ్రాగఢ్‌ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద దోదరాజ్‌ నుంచి కవండే వరకు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఆయుధాలతో నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చిన మావోలు రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ ఉనికికి ప్రమాదమని భావించి మావోయిస్టులు వాహనాలను తగులబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని