Karnataka నుంచి బైడెన్, కమలకు మాస్కులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కర్ణాటకలోని దావణగెరెకు చెందిన వివేకానంద

Published : 16 May 2021 11:19 IST

దావణగెరె: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కర్ణాటకలోని దావణగెరెకు చెందిన వివేకానంద అనే వ్యక్తి మాస్కులు పంపించారు. తనే స్వయంగా మాస్కులకు తయారు చేశారు. మూడు పొరలున్న ఈ మాస్కులు అమెరికా చేరుకున్నాయి. గతేడాది నుంచి వివేకానంద మాస్కులు తయారు చేయడం మొదలు పెట్టారు. భార్య శాంతా, కూతురు కావ్య ఆయనకు సాయం చేస్తున్నారు. వివేకానంద తయారు చేసిన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మాస్కులు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా వివేకానంద మాస్కులు పంపించారు. వారి నుంచి అభినందనలూ అందుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని