Corona: కేంద్ర విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్‌

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ కరోనా బారినపడ్డారు. తనకు పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు........

Published : 27 Jan 2022 22:08 IST

దిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌ కరోనా బారినపడ్డారు. తనకు పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జైశంకర్‌ ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌ యెస్‌లే డ్రియాన్‌తో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లో భారత్‌కు ఉన్న అవకాశాలపై ఆయనతో చర్చించారు.

మరోవైపు, దేశంలో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ ఒక్కరోజే 2.86 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు రాగా.. 573 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 22,02,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17శాతంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని