ఈ నెల 12 నుంచి నాట్య ‘పరంపర’ వేడుకలు
భారత సంస్కృతీ నాట్యకళా సౌరభాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘నాట్యతరంగణి’ కళా సంస్థ మరోసారి సిద్ధమైంది. నవంబరు 12వ తేదీ నుంచి 14 వరకు తిరిగి 19 నుంచి 24 తేదీ వరకు ‘ పరంపర’ పేరుతో సాంస్కృతిక నృత్య కచేరీలను నిర్వహించనుంది...
దిల్లీ: భారత సంస్కృతీ నాట్యకళా సౌరభాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘నాట్యతరంగణి’ కళా సంస్థ మరోసారి సిద్ధమైంది. నవంబరు 12 నుంచి 14 వరకు; 19 నుంచి 24వ తేదీ వరకు ‘పరంపర’ పేరుతో సాంస్కృతిక నృత్య కచేరీలను నిర్వహించనుంది. దేశవిదేశాల్లోనూ ఈ సంస్థకు మంచి పేరుంది. పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు రాజా రాధ రెడ్డి, కౌశల్యరెడ్డి సంయుక్తంగా 1976లో ఈ సంస్థను స్థాపించారు. హైదరాబాద్, గురుగ్రామ్, దిల్లీలో శాఖలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో సంగీతం, నృత్యం ఒక భాగం కావాలనే లక్ష్యంతో ‘పరంపర’ పేరిట జాతీయ, అంతర్జాతీయ సంగీత వేడుకలను నిర్వహిస్తున్నారు. ఓ వైపు స్వతంత్ర భారత్ ఆజాదీ అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుండగా... 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నాట్యతరంగణి సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీ లాంటి ప్రముఖులు గతంలో ‘నాట్య తరంగణి’ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భాలూ ఉన్నాయి. అప్రతిహతంగా కొనసాగుతున్న ‘పరంపర’ సంగీత కార్యక్రమాలకు 2020లో కొవిడ్ రూపంలో ఆటంకం ఎదురైంది. ప్రత్యక్ష సంగీత కచేరీలకు అవకాశం లేకపోవడంతో ‘యునైటెడ్ నేషన్స్ ఇండియా’తో కలిసి సంయుక్తంగా ఆన్లైన్లోనే కచేరీలను నిర్వహించారు. అంతేకాకుండా గత 23 ఏళ్లుగా నాట్యతరంగణి చేసిన కార్యక్రమాలను యూట్యూబ్లో అప్లోడ్ చేసి కళా పిపాసులకు ‘నాట్య తరంగణి’ మరింత చేరువైంది. భవిష్యత్లోనూ ‘యునైటెడ్ నేషన్స్’తో కలిసి మరిన్ని ‘పరంపర’ ప్రదర్శనలు చేసేందుకు ‘నాట్యతరంగణి’ సిద్ధమవుతోంది. ఈ ప్రదర్శలను ప్రత్యక్షంగానే కాకుండా సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఫేస్బుక్లోనూ అందుబాటులో ఉంచనున్నారు.
మరోవైపు కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు విధించిన కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి 14 వరకు, తిరిగి 19 నుంచి 21 తేదీ వరకు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ‘నాట్యతరంగణి’ ప్రకటన విడుదల చేసింది. దిల్లీ సాకేత్ రోడ్డులోని నాట్యతరంగణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్కు సమీపంలోని రాజారాధ రంగమంచ్ కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతించనున్నారు. వర్చువల్ ప్రేక్షకుల కోసం యునైటెడ్ నేషన్స్తో పాటు రాజారాధ రెడ్డి యూట్యూబ్ పేజీలో కార్యక్రమాలను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. అంతేకాకుండా రాజారాధరెడ్డి, నాట్యతరంగణి ఫేస్బుక్ పేజీలోనూ లైవ్స్ట్రీమ్ చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.