INS Vela: నావికాదళ అమ్ముల పొదిలో రహస్య అస్త్రం.. రంగంలోకి ‘వేలా’
దేశ నావికాదళ శక్తిని మరింత పెంచేందుకు మరో ఆధునిక అస్త్రం అందుబాటులోకి వచ్చింది. ‘ఐఎన్ఎస్ వేలా’ జలాంతర్గామి నేడు విధుల్లోకి ప్రవేశించింది. నేవీ చీఫ్
ముంబయి: దేశ నావికాదళ శక్తిని మరింత పెంచేందుకు మరో ఆధునిక జలాంతర్గామి అందుబాటులోకి వచ్చింది. ‘ఐఎన్ఎస్ వేలా’ నేడు విధులను మొదలుపెట్టింది. నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ చేతుల మీదుగా ముంబయి తీరంలో దీన్ని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్కు ఉన్న స్టెల్త్ స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాముల్లో ఇది నాలుగోది.
ప్రాజెక్ట్-75 పేరుతో నిర్మిస్తున్న కల్వరీ శ్రేణికి చెందిన ఆరు జలాంతర్గాముల్లో ఇది నాలుగోది. ఫ్రాన్స్కు చెందిన నావల్ గ్రూప్ సంస్థ భాగస్వామ్యంతో ‘స్కార్పీన్’ శ్రేణి’ డిజైన్తో ముంబయిలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ దీన్ని రూపొందించింది. 2019 జులైలో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా.. 2019 మే నెలలో ‘ఐఎన్ఎస్ వేలా’గా నామకరణం చేశారు. పశ్చిమ కమాండ్ కేంద్రంగా ఇది పనిచేయనుంది.
ప్రత్యేకతలివే..
సముద్ర యుద్ధ రీతుల్లో ఐఎన్ఎస్ వేలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆధునిక టార్పిడోలు, యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ సబ్మెరైన్లో 8 మంది అధికారులు, 35 మంది సిబ్బంది ఉంటారు. ఇది డీజిల్-ఎలక్ట్రిక్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇందులోని సీ303, టార్పిడో కౌంటర్మెజర్ సిస్టమ్ వంటి పరికరాలు ఉన్నాయి. 18 టార్పిడోలు లేదా యాంటీ షిప్ మిసైల్స్ను ఇది ప్రయోగించగలదు. సముద్రగర్భంలో అత్యంత రహస్యంగా శత్రువులను గుర్తించి లక్ష్యాలను ఛేదించగలదు.
నాటి ‘వేలా’ పేరు మీదుగా..
1973-2010 మధ్య కాలంలో భారత నావికాదళంలో మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ఐఎన్ఎస్ వేలా గుర్తుగా తాజా జలాంతర్గామికి అదే పేరు పెట్టారు. సొవియట్ ఆర్జిన్కు చెందిన ఫాక్స్ట్రాట్ క్లాస్ సబ్మెరైన్ అయిన నాటి ‘ఐఎన్ఎస్ వేలా’ను 1973 ఆగస్టులో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది.. వేలా క్లాస్ జలాంతర్గాములకు నాయకత్వం వహహంచడమేగాక, సబ్మెరైనర్లకు శిక్షణకు కూడా ఉపయోగపడింది. ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో 37ఏళ్ల పాటు సేవలందించిన ఈ జలాంతర్గామిని 2010 జనవరిలో నావికాదళం నుంచి విరమించారు.
మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో..
మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని రూపొందించామని, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇదొక ముందడుగు అని నేవీ అధికారులు తెలిపారు. దేశీయంగా తయారైన అనేక పరికరాలను ఐఎన్ఎస్ వేలాలో అమర్చినట్లు చెప్పారు. తొలిసారిగా దేశీయంగా నిర్మించిన బ్యాటరీలను ఇందులో ఉపయోగించారు. దేశీయంగా నిర్మించిన ఆధునిక కమ్యూనికేషన్ల సూట్ కూడా ఇందులో ఉంది. దీని వల్ల నావికాదళ శక్తిసామర్థ్యాలు మరింత పదును తేలనున్నాయని అధికారులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్