పేలుడు పదార్థాల కేసు: మరో అధికారి అరెస్టు

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసమైన ఆంటిలా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మరో పోలీసు అధికారిని అరెస్టు చేశారు. ముంబయి నేర విభాగం ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ మానేను అరెస్టు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు....

Published : 23 Apr 2021 23:36 IST

ముంబయి: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసమైన ఆంటిలా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మరో పోలీసు అధికారిని అరెస్టు చేశారు. ముంబయి నేర విభాగం ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ మానేను అరెస్టు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ ముగ్గురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. మార్చి 13న సచిన్‌ వాజేను, ఆ తర్వాత ఈనెల 12న మరో పోలీసు అధికారి రిజాజుద్దీన్‌ ఖాజీని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులు సచిన్‌ వాజేకు సహకరించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

గత మార్చి నెలలో భారత వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో ఓ కారులో పేలుడు పదార్థాలు లభించడం సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు వాహనాన్ని గుర్తించిన కొద్ది రోజులకే ఆ వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ ఓ వాగులో శవమై దొరకడం కలకలం రేపింది. కొద్దిరోజుల అనంతరం పేలుడు పదార్థాల కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటివరకు ఆ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారి సచిన్‌ వాజేనే ఆ వాహనాన్ని ముకేశ్‌ అంబానీ ఇంటివద్ద నిలిపినట్లు ధ్రువీకరించారు. అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వాజేకు సహకరించిన ఇద్దరు పోలీసును గతంలో అరెస్టు చేయగా తాజాగా మరో పోలీసు అధికారిని అదుపులోకి తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని