అధ్యక్షుడి ట్వీట్ తొలగింపు..ట్విటర్పై వేటు!
ట్విటర్పై నైజీరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ట్వీట్ను తొలగించిన రెండు రోజుల తర్వాత అక్కడి ప్రభుత్వం......
నైజీరియా: ట్విటర్పై నైజీరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ట్వీట్ను తొలగించిన రెండు రోజుల తర్వాత అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లోనూ ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు ముదిరిన విషయం తెలిసిందే.
నైజీరియాలో చెలరేగుతున్న అంతర్గత ఘర్షణలు ఉద్దేశిస్తూ.. అధ్యక్షుడు బుహారీ నిరసనకారులను ట్విటర్ మాధ్యమం ద్వారా ఘాటుగా హెచ్చరించారు. 1967-1970 మధ్య కాలంలో 30 నెలల పాటు చెలరేగిన పౌర యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలు తప్పవని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర పన్నుతున్న వారు వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై స్పందించిన ట్విటర్ వివాదాస్పదమైన అధ్యక్షుడి ట్వీట్ను తొలగించింది. ట్విటర్ చర్యను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేశంలో శాంతి పరిరక్షణ కోసం అధ్యక్షుడు చేస్తున్న కృషికి ట్విటర్ అడ్డుతగులుతోందని ఆరోపించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న అసాంఘిక శక్తులకు మద్దతుగా నిలుస్తోందని వ్యాఖ్యానించింది.
తూర్పు నైజీరియా ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని కోరుతూ కనూ అనే నేత నాయకత్వంలో ‘ఇండీజినస్ పీపుల్ ఆఫ్ బయాఫ్రా(ఐపీఓబీ)’ నిరసనలు కొనసాగిస్తోంది. దీనిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. వీటిని ఉద్దేశిస్తూ అధ్యక్షుడు తాజా ట్వీట్లు చేశారు.
భారత్లోనూ కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ మధ్య విభేదాలు ముదిరిన విషయం తెలిసిందే. నూతన డిజిటల్ నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమాలన్నీ తమ అధికారుల వివరాలను తెలియజేయాలని ఐటీశాఖ ఆదేశించగా.. గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, కూ, షేర్చాట్, టెలిగ్రాం, లింక్డిన్ తదితర వేదికలు నిర్దేశిత వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాయి. ట్విటర్ మాత్రం ఈ నిబంధనలను పాటించడం లేదని ప్రభుత్వ వర్గాలు గత శుక్రవారం పేర్కొన్నాయి. అంతకుముందు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా చేసిన ఓ ట్వీట్కు.. ‘కల్పిత మీడియా’ అంటూ ట్విటర్ ట్యాగ్ను జోడించడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందంటూ ఆక్షేపించింది. వెంటనే ట్యాగ్ను తొలగించాలంటూ ఘాటు లేఖ రాసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం