దిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధింపు

దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తుండటంతో..వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాలు, నగరాలు కఠిన ఆంక్షల అమలుకు మొగ్గుచూపుతున్నాయి.

Published : 06 Apr 2021 12:13 IST

నేటి నుంచి ఏప్రిల్‌ 30 వరకు అమల్లో ఉండనున్న ఆంక్షలు

దిల్లీ: దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తుండటంతో..వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాలు, నగరాలు కఠిన ఆంక్షల అమలుకు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా దిల్లీ ప్రభుత్వం ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని వాటిలో పేర్కొంది. దిల్లీలో ప్రస్తుతం నాలుగో దఫా వైరస్‌ విజృంభణ కనిపిస్తోందని, అయితే లాక్‌డౌన్ యోచన లేదని శుక్రవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సరైన సంప్రదింపుల అనంతరమే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

గడిచిన 24 గంటల్లో దిల్లీలో 3,548 మందికి కరోనా సోకగా.. 15 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 6,79,962 మంది వైరస్ బారినపడ్డారు. 11,096 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని