సైబర్ మోసాలతో ‘అణు’సంపద
ప్రపంచమంతా ఓ దారైతే.. తనదో దారి అంటుంది ఉత్తరకొరియా. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను కూడా లెక్కచేయకుండా అణు పరీక్షలు చేసి అగ్రరాజ్యం అమెరికాను భయపెట్టాలని చూస్తోన్న కిమ్ రాజ్యం
ఉత్తరకొరియా దుస్సాహసం.. ఆన్లైన్లో దోపిడీ
యునైటెడ్ నేషన్స్: ప్రపంచమంతా ఓ దారైతే.. తనదో దారి అన్నట్లు ఉంటుంది ఉత్తరకొరియా వ్యవహారం. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను సైతం లెక్కచేయకుండా అణు పరీక్షలు చేసి అగ్రరాజ్యం అమెరికాను భయపెట్టాలని చూస్తోన్న కిమ్ రాజ్యం.. ఇప్పుడు కరోనాతో కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మరి తినడానికే తిండి లేనప్పుడు అణు పరీక్షలకు డబ్బెలా.. అందుకేనేమో ఆన్లైన్లో దోపిడీకి దిగింది. సైబర్ నేరాలకు పాల్పడుతూ 300 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించింది. ఆ నిధులతో తన అణ్వాయుధాలు, క్షిపణులను ఆధునీకరిస్తోందట. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ రహస్య నివేదిక ద్వారా వెల్లడైంది.
ఈశాన్య ఆసియా దేశాలపై ఆంక్షలను పర్యవేక్షించిన ఐరాస నిపుణుల కమిటీ ఒకటి ఆ నివేదికను సోమవారం భద్రతా మండలి సభ్యులకు పంపింది. 2019 నుంచి 2020 నవంబరు మధ్య ఉత్తర కొరియా హ్యాకర్లు పలుమార్లు సైబర్ దాడులు జరిపి 316.4 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని దోచుకున్నట్లు ఈ కమిటీ తమ నివేదికలో పేర్కొన్నట్లు భద్రతా మండలిలోని విశ్వసనీయ వర్గాలు బహిర్గతం చేశాయి. ఉత్తరకొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాల కోసం ఆ దేశ హ్యాకర్లు.. ఆర్థిక సంస్థలు, వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ హౌస్లపై దాడి చేసి డబ్బు దొంగలించాయని నివేదిక తెలిపింది. సైబర్ దాడులకు పాల్పడిన హ్యాకర్లకు డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో సంబంధాలున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. ఇటీవల ఆ దేశంలో జరిగిన మిలిటరీ పరేడ్లో ఆధునీకరించిన తమ ఆయుధ సంపత్తిని ఉత్తరకొరియా ప్రదర్శించినట్లు పేర్కొంది.
నిజానికి ఉత్తరకొరియా అణ్వాయుధ ప్రయోగాలు చేయకుండా ఐరాస ఆంక్షలు ఉన్నాయి. 2006లో తొలిసారిగా అణు పరికరాన్ని ప్రయోగించినప్పటి నుంచి ఆ దేశంపై ఐరాస కఠిన ఆంక్షలు విధించింది. అణు పరీక్షలు చేయకుండా ఉత్తరకొరియాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశం నుంచి చాలా ఎగుమతులను నిషేధించింది. దిగుమతులను కూడా పరిమితం చేసింది. అయినప్పటికీ ఆ ఆంక్షలను బేఖాతరు చేస్తూ కిమ్ రాజ్యం తన అణు సంపత్తిని పెంచుకుంటోందని పలుమార్లు బహిర్గతమైంది. ఇక ఎగుమతులు లేకపోవడంతో ఆర్థికంగా పుంజుకోవడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తాజాగా రుజువైంది.
అమెరికాను అడ్డుకునేందుకేనా..
2017లో ఉత్తరకొరియా థర్మోన్యూక్లియర్ వార్హెడ్తో పాటు కొన్ని క్షిపణి పరీక్షలు జరిపింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకునేలా వీటిని రూపొందించినట్లు అప్పట్లో కిమ్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య చిచ్చు రాజుకుంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి 2019లో ఇరు దేశాల అధినేతలు మూడుసార్లు సమావేశమయ్యారు. అయితే కిమ్ డిమాండ్లను అప్పటి అగ్రరాజ్యాధినేత ట్రంప్ తిరస్కరించడంతో విఫలమయ్యాయి. ఇటీవల ఉత్తరకొరియాలో జరిగిన రాజకీయ సమావేశంలో కిమ్.. మరోసారి అణ్వాయుధాల గురించి నొక్కిచెప్పినట్లు తెలిసింది. అణు కార్యక్రమాల కోసం అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ఆర్థిక సంక్షోభంలో..
గతేడాది ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో ఉత్తరకొరియా బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. సరిహద్దులు మూసేసి సరకు రవాణాను నిలిపివేసింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో నిధుల కోసం సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్