భవిష్యత్తులో..సాధారణ జలుబుగానే కరోనా!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు మాదిరిగానే మారనుందని తాజా పరిశోధన వెల్లడించింది.
అంచనా వేసిన అమెరికా శాస్త్రవేత్తలు
దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు మాదిరిగానే మారనుందని తాజా పరిశోధన వెల్లడించింది. ప్రస్తుతం మహమ్మారిగా ఉన్న కరోనా వైరస్, ఎండమిక్గా మారిన తర్వాత తీవ్రత తగ్గవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వైరస్ బారినపడుతోన్న చిన్నారులకు భవిష్యత్తులో ఇది సాధారణ జలుబుగానే మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సార్స్-కోవ్-1 తోపాటు మరో నాలుగు కరోనా వైరస్ రకాలపై జరిపిన ఈ పరిశోధన పత్రం తాజాగా సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది.
సాధారణ ప్రజల్లో ఇది విస్తృతంగా వ్యాపించిన తర్వాత ఇది స్థానిక వ్యాధిగా మారే అవకాశం ఉన్నట్లు అమెరికా పరిశోధకులు అంచనా వేశారు. ఇప్పటికే ఈ గ్రూపు వైరస్లకు సంబంధించిన వ్యాధినిరోధక చికిత్సా విధానం, సాంక్రమిక వ్యాధుల అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుతం విజృంభిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత తీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణ జలుబుకు కారణమయ్యే నాలుగు రకాల కరోనా వైరస్లు ప్రస్తుతం వ్యాప్తిలో ఎంతోకాలంగా ఉన్నాయని, ప్రతిఒక్కరు వారి చిన్నతనంలోనే వీటి బారినపడి ఉంటారని తెలిపారు.
చిన్నారుల్లో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల వారిలో రోగనిరోధకత లభిస్తుందని, ఇవి భవిష్యత్తులో వచ్చే తీవ్ర రోగాలను ఎదుర్కోవడంలో దోహదపడుతాయని అమెరికాలో ఎమోరీ యూనివర్సిటీకి చెందిన జెన్నీ లావైన్ వెల్లడించారు. అయితే, అప్పుడప్పుడు సంభవించే రీ ఇన్ఫెక్షన్లను మాత్రం నియంత్రించలేవని తెలిపారు. 3 నుంచి 5ఏళ్లలోపు చిన్నారుల్లో సార్స్-కోవ్-2 తొలుత సంక్రమించినప్పుడు ఓ వ్యాధిలో కనిపించినప్పటికీ, తర్వాత దాని తీవ్రత తగ్గి స్వల్ప వ్యాధిలాగే మారుతుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ పెద్దవారికి వైరస్ సోకినప్పుడు తీవ్రతను తగ్గించడంలో వారి చిన్నతనంలో వైరస్ వల్ల పొందిన రోగనిరోధకత రక్షణ కలిపిస్తుందని అంచనా వేశారు. అయితే, ఇది జరగడానికి ఎంతకాలం పడుతుందనే విషయం మాత్రం వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ల వల్ల పొందే రోగనిరోధకతపైన ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం చేపడుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడగలమని అమెరికా శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి..
భారత్: 100దాటిన కొత్తరకం కేసులు
అది నిజంగా చైనా టీకానే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం