Zika virus: కేరళలో మరో కేసు..!

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గక ముందే కేరళలో జికా వైరస్‌ కలకలం రేపుతోంది.  తిరువనంతపురంలోని

Published : 12 Jul 2021 22:57 IST

తిరువనంతపురం: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గక ముందే కేరళలో జికా వైరస్‌ కలకలం రేపుతోంది.  తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 73 ఏళ్ల వృద్ధురాలు ఈ వైరస్‌ బారిన పడినట్టు సోమవారం నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన మొదలైంది. తాజాగా నమోదైన కేసుతో రాష్ట్రంలో జికా వైరస్‌ కేసుల సంఖ్య 19కి చేరింది.  ఈ  మేరకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ అధికారికంగా ధ్రువీకరించారు. అయితే అలప్పుజలోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపిన 5 శాంపిళ్లను పరీక్షించగా ఫలితం నెగెటివ్‌ వచ్చింది.

గడిచిన ఆదివారం కేరళలో మూడు జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలోని తిరువనంతపురం, త్రిస్సుర్‌, కోయికోడ్‌లలోని వైద్య కళాశాలలు, అలప్పుజలోని ఎన్‌ఐవీలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో  2,100 పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచింది. ప్రత్యేకించి గర్భిణీలు సహా జ్వరం, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్ల లాంటి లక్షణాలు కనిపించినవారిని పరీక్షించాల్సిందిగా ఆసుపత్రులకు సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని