Pakistan: పాకిస్థాన్ పౌరుల డేటాబేస్ హ్యాక్!
పాకిస్థాన్ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదం, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ విభేదాలు తదితర సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్కు తాజాగా సైబర్ దాడి రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పాకిస్థాన్ పౌరులకు సంబంధించిన డేటాబేస్ హ్యాక్కు గురైనట్లు ఫెడరల్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదం, ఆర్థిక ఇబ్బందులు, విదేశాలతో విభేదాలు తదితర సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్కు తాజాగా సైబర్ దాడి రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పాకిస్థాన్ పౌరులకు సంబంధించిన డేటాబేస్ హ్యాక్కు గురైనట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) ఆ దేశ పార్లమెంట్ ప్యానెల్కు సమాచారం ఇచ్చింది.
పాకిస్థాన్ పౌరులకు సంబంధించిన అన్ని వివరాలను నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ(నాడ్రా) నమోదు చేస్తుంటుంది. ప్రతి పౌరుడికి చెందిన బయోమెట్రిక్ సహా సమస్త వివరాలు నాడ్రా డేటాబేస్లో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రజలకు గుర్తింపు కార్డులు, పాస్పోర్టు జారీ చేసే అధికారం కూడా కేవలం నాడ్రాకి మాత్రమే ఉంది. అంతటి కీలకమైన డేటాబేస్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఎఫ్ఐఏ అధికారులు వెల్లడించారు. అలా దొంగలించిన పౌరుల డేటాతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిమ్కార్డులు జారీ అవుతున్నట్లు గుర్తించామని, ఇప్పటి వరకు పంజాబ్ ప్రావిన్స్లో 13వేల సిమ్కార్డులను సీజ్ చేశామని పార్లమెంట్ కమిటీకి తెలిపారు. నష్టనివారణ చర్యలు సైతం ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఐఏ అధికారులు నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్కు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం