డీపీఆర్‌ ఆధారంగానే రైల్వే కారిడార్ల ఆమోదం

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు నూతన హై స్పీడ్‌ రైల్‌ కారిడార్ల డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతను భారతీయ రైల్వేకు అప్పగించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు...

Published : 10 Mar 2021 17:17 IST

లోక్‌సభలో రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు నూతన హై స్పీడ్‌ రైల్‌ కారిడార్ల డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతను భారతీయ రైల్వేకు అప్పగించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క కారిడార్‌ డీపీఆర్‌ కూడా పూర్తికాలేదని గోయల్‌ తెలిపారు. డీపీఆర్‌లో పొందుపర్చిన అంశాల ఆధారంగా కారిడార్లను ఆమోదిస్తామని స్పష్టం చేశారు.

దేశంలో ముంబయి- అహ్మదాబాద్‌తో పాటు దిల్లీ-నోయిడా-ఆగ్రా-లక్నో-వారణాసి; దిల్లీ-జైపుర్‌-ఉదయ్‌పుర్‌-అహ్మదాబాద్‌; ముంబయి-నాసిక్‌-నాగ్‌పుర్‌; ముంబయి-పుణె-హైదరాబాద్‌; చెన్నై-బెంగళూరు-మైసూరు; దిల్లీ-చండీగఢ్‌-లుథియానా-జలంధర్‌-అమృతసర్.. ఇలా  మొత్తంలో ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్‌లను గుర్తించినట్లు అప్పటి రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. ముంబయి- అహ్మదాబాద్‌ మార్గంలో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుపుతామని తెలిపారు. వీటికి డీపీఆర్‌లు సిద్ధం చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని