Plastic Waste: ప్రపంచంలో సగం 20సంస్థల నుంచే!
ప్రపంచంలో వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో సగానికిపైగా (55శాతం) వాటా కేవలం 20 సంస్థలదేనని తాజా అధ్యయనం వెల్లడించింది.
తాజా నివేదిక వెల్లడి
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం ఊహించని రీతిలో పెరిగిపోతోంది. ప్రపంచంలో వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో సగానికిపైగా (55శాతం) వాటా కేవలం 20 సంస్థలదేనని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్లాస్టిక్ వేస్ట్-మేకర్స్ ఇండెక్స్ ప్రకారం, కేవలం మూడు కంపెనీలే ప్రపంచంలోని 16శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను (పాలిమర్స్) ఉత్పత్తి చేస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు కావాల్సిన ముడిపదార్థాలను తయారుచేసే దాదాపు వెయ్యి పరిశ్రమల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం లండన్కు పరిశోధకులు తాజా నివేదిక రూపొందించారు
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తోన్న వాటిలో 90శాతం కేవలం వంద కంపెనీల నుంచే వస్తున్నట్లు ఆండ్రూ అండ్ నికోలా ఫోర్రెస్ట్స్ మైండెరో ఫౌండేషన్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి ఏటా ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 13కోట్ల టన్నులు ఉంటుండగా.. వీటిలో సగానికి పైగా కేవలం 20అంతర్జాతీయ సంస్థలదేనని తెలిపింది. వీటిలో బహుళజాతి సంస్థలతో పాటు చమురు, గ్యాస్ కంపెనీలదే అగ్రస్థానం. ఒకేసారి వాడి పడవేసే ప్లాస్టిక్ పదార్థాల వినియోగంలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. అమెరికా, దక్షిణకొరియా, యూకే, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ముందువరుసలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో అత్యధికంగా ఒక ఏడాది( 2019లో) ఒక వ్యక్తి సగటున 59కిలోల వ్యర్థాలకు కారణమవుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇది అమెరికాలో సగటున 53 కిలోలు, దక్షిణ కొరియా, యూకేలలో 44కిలోలు, జపాన్లో 37కిలోలుగా ఉన్నట్లు తెలిపింది.
ధనిక దేశాల్లో ప్లాస్టిక్ నిర్వహణ పేలవం..
ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న సంస్థల్లో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎక్జాన్ మొబిల్ సంస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థ ఏడాదికి 59లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తోంది. ఇక డౌ కెమికల్స్ నుంచి 55లక్షల టన్నులు వస్తుండగా, చైనాకు చెందిన సినోపెక్ సంస్థ 53లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఇలా ప్రపంచం మొత్తం విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ధనిక దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పేలవంగా ఉండటం వల్ల కాలుష్యం మరింత ఎక్కువ అవుతున్నట్లు పర్యావరణవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ఎక్కువైన విషయం తెలిసిందే. ఇలా ప్రపంచంలో దాదాపు 55శాతం ప్లాస్టిక్ వ్యర్థాలకు చమురు, గ్యాస్ సంస్థలతో పాటు బహుళజాతి సంస్థల పాలిమర్స్ కారణమవుతున్నాయి. వీటికితోడు ఒకేసారి వాడే మాస్కులు, సీసాల నుంచి ఆహార పదార్థాల ప్యాకింగ్, ప్లాస్టిక్ బ్యాగుల వరకు వివిధ వస్తువుల రూపంలో ఉండే ప్లాస్టిక్ వస్తువులు చివరకు వ్యర్థాలుగా మారుతున్నాయి. ఇలా ఒకేసారి వాడి పడేసే వస్తువులతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా ఏర్పడుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుచేత సహజవాయు (పెట్రోకెమికల్) సంస్థలు పాలిమర్స్ ఉత్పత్తి తగ్గించడం, ఇప్పటికే పర్యావరణంలో భారీగా పేరుకుపోయిన వ్యర్థ్యాలను రీసైకిల్ చేయడం వంటి చర్యలను చేపట్టాలని తాజా నివేదిక సూచించింది. లేనట్లయితే ఇప్పటికే వివిధ రూపాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు తీవ్ర కాలుష్యానికి కారణమవుతాయని తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు