జో బైడెన్‌కు ప్రధాని మోదీ అభినందనలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షరాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. క్షణక్షణం ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ 270ను దాటి పోయారు. ట్రంప్‌ 214 దగ్గరే 

Updated : 08 Nov 2020 10:27 IST

దిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షరాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. క్షణక్షణం ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ 270ను దాటి పోయారు. ట్రంప్‌ 214 దగ్గరే ఆగిపోయారు. దీంతో 77 ఏళ్ల జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవీ కల సాకరమైంది. ఈ విజయం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. 

అమెరికా 46వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టున్న జో బైడెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ మీరు అద్భుతమైన విజయం సాధించినందుకు అభినందనలు. గతంలో భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో మీ పాత్ర అమూల్యమైనది. మీతో కలిసి పనిచేసేందుకు, ఇరు దేశాల సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. 

మరోవైపు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతి వ్యక్తి కమలా హారీస్‌ విజయంపై ప్రధాని మరో ట్వీట్‌ చేశారు. ‘‘మీ విజయం మార్గదర్శకం. భారతీయ-అమెరికన్లందరికీ గర్వకారణం. మీ సహకారంతో భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

జో బైడెన్ విజయంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలాహారిస్‌కు శుభాకాంక్షలు. బైడెన్‌ విజయవంతంగా తన పదవిని నిర్వర్తించాలి. భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఎదురుచూస్తున్నాం’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని