‘మన క్రమశిక్షణ.. ప్రపంచానికే ఉదాహరణ’
గతేడాది దేశవ్యాప్తంగా చేపట్టిన జనతా కర్ఫ్యూలో భారతీయులు చాటిన క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
దిల్లీ: గతేడాది దేశవ్యాప్తంగా చేపట్టిన జనతా కర్ఫ్యూలో భారతీయులు చాటిన క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం 75 ఎడిషన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ శ్రోతలకు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమం!
‘గతేడాది మార్చిలో కరోనాను కట్టడి చేసేందుకు మనం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను చేపట్టాం. ఈ కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన అసాధారణ క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలిచింది. అంతేకాకుండా దీన్ని భవిష్యత్ తరాలు సైతం గుర్తు పెట్టుకుంటాయి. ప్రస్తుతం మనదేశంలో ప్రపచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. యూపీలోని జౌన్పూర్లో 109 ఏళ్ల వృద్ధురాలు వ్యాక్సిన్ తీసుకున్నారు. అదేవిధంగా దిల్లీలో 107ఏళ్ల వృద్ధురాలు టీకా తీసుకున్నారు. మనం ప్రజలందర్నీ ‘దవాయి బీ, కడాయి బీ’(వైద్యం, జాగ్రత్తలు) అనే మంత్రానికి కట్టుబడి ఉండేలా చేయాలి’ అని మోదీ వెల్లడించారు.
అన్ని రంగాల్లో దేశ మహిళల సత్తా!
‘భారత మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతోపాటు ఇతర అన్ని రంగాల్లో తమదైన సత్తా చాటుతున్నారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ ఉన్నత స్థానం సాధించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ మిథాలీరాజ్కు శుభాకాంక్షలు. బ్యాడ్మింటన్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో రజత పతకం సాధించిన పీవీ సింధుకు అభినందనలు. మార్చి నెలలో మనం మహిళా దినోత్సవం జరుపుకొన్నాం. ఇదే నెలలో మన దేశ మహిళలు క్రీడల్లో పతకాలు, రికార్డులు సాధించడం విశేషం’అని మోదీ అభినందించారు.
అమృత్ మహోత్సవ్లో భాగం కావాలి
‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 నాటికి 75వసంతాలు పూర్తి కానున్న నేపథ్యంలో... కేంద్రం ‘అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని తలపెట్టింది. అమృత్ మహోత్సవ్కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి ఒక ప్రాంతం చరిత్రగానీ, ఒక వ్యక్తి గురించి గానీ, సంస్కృతి గానీ తెరపైకి తెచ్చి దేశస్థులతో పంచుకోవచ్చు. మన చుట్టూ ఉన్న అపారమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తూనే.. కొత్త తరానికి చేరుకోవడానికి మనం కృషి చేయాలి’’ అని ప్రధాని చెప్పారు.
వీరి ప్రయత్నాలు ఎందరికో స్ఫూర్తి!
తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన బస్ కండక్టర్ యోగనాథన్ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన కండక్టర్గా విధులు నిర్వర్తిస్తూనే చెట్లు నాటడం పట్ల అవగాహన కల్పిస్తున్న తీరు ఎంతో బాగుందన్నారు. అదేవిధంగా ఒడిశాలోని కేంద్రపాడకు చెందిన విజయ్ అనే వ్యక్తి 12 సంవత్సరాలు శ్రమించి సముద్రం ఒడ్డున 25 ఎకరాల మడ అడవిని నిర్మించారని అభినందించారు. ‘ఇటీవల మనం పిచ్చుకల దినోత్సవం జరుపుకొన్నాం. కాబట్టి ప్రకృతిలో పిచ్చుకల్ని రక్షించేందుకు మనం కృషి చేయాలి. ఈ సందర్భంగా బెనారస్కు చెందిన మన మిత్రుడు ఇంద్రపాల్ గురించి చెప్పుకోవాలి. ఆయన తన ఇంటిని పిచ్చుకల నివాసంగా మార్చుకున్నారు. ఆయన ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం’అని మోదీ అన్నారు. వీరితోపాటు సమాజ శ్రేయస్సుకు పాల్పడుతున్న పలువురిని ప్రధాని మెచ్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా