Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. పాజిటివిటీ రేటు దిగొస్తుండగా.. రికవరీ రేటు పెరుగుతోంది. దీనికితోడు వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమంగా పుంజుకోవడం.....
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. పాజిటివిటీ రేటు దిగొస్తుండగా.. రికవరీ రేటు పెరుగుతోంది. దీనికితోడు వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమంగా పుంజుకోవడం ఊరటనిస్తోంది. మరోవైపు, ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనా కష్టకాలంలో ఉపశమనం కలిగించే ఇలాంటి మరికొన్ని వార్తలు మీకోసం..
* దేశంలో కరోనా కేసులు 61 రోజుల కనిష్ఠానికి చేరాయి. వరుసగా 25వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీ అయినవారి సంఖ్యే ఎక్కువగా కొనసాగింది. వరుసగా 14వ రోజూ రోజువారీ పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా తక్కువగా (6.34శాతం) నమోదైంది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడంతో యాక్టివ్ కేసుల కొండ కరుగుతోంది. ప్రస్తుతం 14.01లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 36.6 కోట్ల మందికి పరీక్షలు చేశారు. దేశంలో రికవరీ రేటు 93.94 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.21శాతంగా ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు దేశ వ్యాప్తంగా 23.27 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
* కరోనా ఆపత్కాలంలో పేదలను ఆదుకొనేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని మరోసారి పొడిగించారు. ఈ పథకం కింద ఇచ్చే ఉచిత రేషన్ను దీపావళి వరకు అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద కేంద్రం నిర్దేశించిన విధంగా ఆహార ధాన్యాలను ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు నవంబర్ వరకు ఉచితంగా ఆహారధాన్యాలు అందుతాయని మోదీ పేర్కొన్నారు.
* కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ను పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలను ఈ నెల 16వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. జూన్ 12,13 (శని, ఆది) తేదీల్లో మాత్రం పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేస్తామని సీఎంవో తెలిపింది. అలాగే, పంజాబ్ ప్రబుత్వం కూడా కరోనా ఆంక్షలను జూన్ 15వరకు పొడిగించింది. సాయంత్రం 6గంటల వరకు దుకాణాలకు అనుమతివ్వడంతో పాటు ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో పనిచేసేలా పలు సడలింపులను ఇచ్చింది. రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటుందని, ఆదివారాల్లో మాత్రం రెగ్యులర్ కర్ఫ్యూ అమలు చేస్తామని పేర్కొంది.
* దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అందరికీ జూన్ 21 (ప్రపంచ యోగా దినోత్సవం) నుంచి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. టీకాలకు రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని, ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని వెల్లడించారు. కంపెనీలు ఉత్పత్తి చేసిన దాంట్లో 75శాతం వ్యాక్సిన్ను కేంద్రమే సేకరించి రాష్ట్రాలకు ఇస్తుందని, 25శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసుకోవచ్చన్నారు.
* ఏపీలో కొత్త కేసులు భారీగా తగ్గాయి. నిన్న 64,800 శాంపిల్స్ పరీక్షిస్తే.. 4,872 మందిలో కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అలాగే, తాజాగా మరో 13,702 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,510 క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు, ఏపీలో పగటి పూట కర్ఫ్యూని ఈ నెల 20 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 11 నుంచి సడలింపుల సమయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 2గంటల వరకు పెంచింది.
* నవంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ప్రధాని ప్రకటించారు. సొంత ఖర్చుతో టీకా వేసుకొనేవారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. గరిష్ఠంగా రూ.150 సర్వీస్ ఛార్జితో అక్కడ టీకా పొందవచ్చని మోదీ తెలిపారు. ఏడు కంపెనీలు టీకా తయారు చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. వ్యాక్సినేషన్లో మనం ఎవరికన్నా వెనుకబడి లేమని ప్రధాని స్పష్టంచేశారు.
* టీకా పంపిణీ మరింత వేగవంతం చేసేందుకు దిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఓటు ఉన్న పోలింగ్ కేంద్రం వద్దకే వెళ్లి ప్రజలు టీకా వేయించుకొనేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే, త్వరలోనే ఇంటి వద్దకే వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. వచ్చే నాలుగు వారాల్లోనే 65ఏళ్ల వయసు పైబడిన అందరికీ టీకా పంపిణీ పూర్తి చేస్తామన్నారు. దిల్లీలో కొత్త కేసులు భారీగా తగ్గిపోవడంతో ఈ రోజు నుంచే సడలింపులు అమలుచేస్తున్నారు.
* థర్డ్ వేవ్ ముప్పు ఉందంటూ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో చిన్నారుల కోసం 3కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. విశాఖ, తిరుపతి, విజయవాడ-గుంటూరులలో ఒకచోట సిద్ధం చేయాలన్నారు. ఒక్కో కేర్ సెంటర్కు రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. థర్డ్ వేవ్పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పోషకాహార పంపిణీ, టీకాల కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారుల్ని ఆదేశించారు.
* ఏపీలో కొవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆర్థిక సాయం మంజూరు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున రూ.1.30కోట్ల నిధులు విడుదల చేశారు. విశాఖలో 13మంది పిల్లల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. 62.37% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!