Puneeth Rajkumar: నాతో పునీత్‌ ఆఖరి మాటలు ఇవే.. కర్ణాటక సీఎం బొమ్మై

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇటీవల పునీత్‌ తనతో సంభాషణలో.........

Published : 31 Oct 2021 01:57 IST

బెంగళూరు: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇటీవల పునీత్‌ తనతో సంభాషణలో ఆఖరి మాటలను శనివారం ఆయన గుర్తుచేసుకున్నారు. గురువారం (మరణానికి ముందు రోజు) రోజున పునీత్ రాజ్‌కుమార్‌ కర్ణాటక టూరిజానికి సంబంధించిన ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించాలని తనను కోరారన్నారు. నవంబర్‌ 1న దానికి సంబంధించిన యాప్‌ని విడుదల చేయబోతున్నాననీ.. కానీ  ఆయన మన మధ్య లేకపోవడం షాకింగ్‌గా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కర్ణాటక రాష్ట్రం, కన్నడ చిత్రసీమ, యువత ఆయన్ను మిస్‌ అవుతున్నారని సీఎం పేర్కొన్నారు. 

స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. కన్నడ ప్రజల అభిమాన హీరో అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు సీఎం బసవరాజ బొమ్మై శుక్రవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. పునీత్ అకాల మరణంపై దేశవ్యాప్తంగా అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని