Rajasthan: ‘బాల్య వివాహాల’ నమోదుపై విమర్శలు.. బిల్లుపై వెనక్కి తగ్గిన రాజస్థాన్
బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేందుకు అవకాశమిచ్చేలా రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి.
జైపూర్: బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేందుకు అవకాశమిచ్చేలా రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. దీంతో వెనక్కి తగ్గిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంది. అసలేం జరిగిందంటే..
రాష్ట్రంలో జరిగే అన్ని వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేసేలా ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజీ(సవరణ) బిల్లును రూపొందించింది. సెప్టెంబరు 17న ఈ బిల్లును అక్కడి శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదముద్ర కూడా పడింది. అయితే ఇంకా చట్టరూపం దాల్చలేదు. అయితే ఈ బిల్లులోని ఓ క్లాజ్ ప్రకారం.. ‘‘వధువు వయసు 18ఏళ్లు లోపు, వరుడి వయసు 21 ఏళ్ల లోపు ఉంటే వారి తల్లిదండ్రులు 30 రోజుల లోగా తమ పిల్లల పెళ్లిని తప్పనిసరిగా నమోదు చేయాలి’’ అని ఉంది. అంటే.. బాల్య వివాహామైనా కూడా తల్లిదండ్రుల అనుమతి ఉంటే వాటిని చట్టబద్ధం చేయొచ్చన్నమాట. దీంతో ఇది కాస్తా తీవ్ర వివాదానికి తెరతీసింది.
ఈ బిల్లుపై ప్రతిపక్ష భాజపా సహా హక్కుల కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు బాల్య వివాహాలను అరికట్టాలని దేశమంతా ఉద్యమాలు జరుగుతుంటే.. రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం వాటికి చట్టపరంగా అనుమతి కల్పిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బిల్లు బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఉందంటూ పలువురు మండిపడుతున్నారు. దీనిని ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో సవాల్ కూడా చేసింది. దీంతో ఈ వివాదాస్పద బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
‘‘వివాహాలను చట్టబద్ధం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ సవరణ బిల్లును తీసుకొచ్చాం. అయితే ఇందులోని కొన్ని నిబంధలను బాల్య వివాహాలను సమర్థించేలా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే బిల్లును వెనక్కి పంపాలని గవర్నర్ను కోరాం. దీనిపై న్యాయపరమైన సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణ చేపడతాం. బాల్య వివాహాలపై మా ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడదు. వాటిని నిర్మూలించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం’’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వెల్లడించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున రాజస్థాన్ ఈ బిల్లును వెనక్కి తీసుకోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్