1000 పడకలతో రిలయన్స్ కొవిడ్ ఆస్పత్రి
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. తన వంతు సహాయం చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన రెండు కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
కొవిడ్ బాధితులకు ఉచితంగా వైద్యం
5రోజుల్లో 400 పడకలు సిద్ధం - వెల్లడించిన రిలయన్స్ ఫౌండేషన్
ముంబయి: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. తన వంతు సహాయం చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన రెండు కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్నగర్లో వీటిని ఏర్పాటు చేస్తోన్న ఈ కేంద్రాల్లో.. కొవిడ్ బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తామని వెల్లడించింది. కేవలం ఐదు రోజుల్లోనే 400పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిని అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ ప్రతినిధులు వెల్లడించారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ధాటికి చాలా రాష్ట్రాల్లో ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఏ రూపంలోనైనా సహాయం చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. దీంతో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి కొవిడ్ పడకలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జామ్నగర్లో ఉన్న ప్రభుత్వ దంత వైద్యశాలలో ఆక్సిజన్ సదుపాయం ఉన్న 400 పడకలు సిద్ధంచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్ అధికారులు వెల్లడించారు. మరో 600 పడకలను జామ్నగర్లోని మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరో వారం, పది రోజుల్లోనే పూర్తిస్థాయిలో దీన్ని సిద్ధం చేస్తామని రిలయన్స్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వీటితో మొత్తం కలిపి 1875 పడకలను కొవిడ్ కేర్ కోసం రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.
రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోన్న ఈ కొవిడ్ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని రాష్ట్రప్రభుత్వం సమకూరుస్తుందని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. ఇక ఆసుపత్రిలో వైద్య పరికరాలు, ఇతర సామగ్రితోపాటు చికిత్సకు అవసరమయ్యే సదుపాయాలను మాత్రం రిలయన్స్ సమకూరుస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్నగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు సేవలు అందుతాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 15వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షా 33వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 174 మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్ బాధితుల్లో 6830 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 2లక్షలు దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?