Covid 19: అందుకే.. కొవిడ్ తర్వాత వేగంగా వ్యాధుల ముసురు..!
కొవిడ్ సోకితే రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక కణాల సామర్థ్యాన్ని కుంటుబరుస్తోందని.. ఫలితంగా అనుబంధ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు
దెబ్బతింటోన్న రోగనిరోధక శక్తి..!
ఇంటర్నెట్డెస్క్: కొవిడ్ సోకితే రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక కణాల సామర్థ్యాన్ని ఇది బలహీనపరుస్తోందని.. ఫలితంగా అనుబంధ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు అవి స్పందించే తీరులో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. మ్యూనిచ్లోని లూడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. విశ్వవిద్యాలయ బయోమెడికల్ సెంటర్లోని ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ అన్నె క్రూగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. వైరస్ కారణంగా రోగనిరోధక శక్తిపై పడుతున్న అదృశ్య దుష్ప్రభావాలను కనుక్కోవడమే లక్ష్యంగా ఈ పరిశోధన సాగింది. ఈ పరిశోధన ఫలితాలను పీఎల్వోఎస్ పాథోజెన్స్ జర్నల్లో ప్రచురించారు.
పరిశోధన ఫలితాలు ఇలా..
సార్స్ కోవ్-2 సోకిన వారిలో 3 నుంచి 10 శాతం రోగులకు మధ్య స్థాయి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో వైరస్పై రోగనిరోధక శక్తి తీవ్రంగా స్పందిస్తోంది. ఇది శరీరంలోని కీలక వ్యవస్థల్లో వాపును పుట్టిస్తోంది. నరాల లోపల రక్తం గడ్డలు కట్టేందుకు కారణం అవుతోంది. ఫలితంగా ఇది గుండెపై ప్రతికూల ప్రభావం చూపిస్తోన్నట్లు గుర్తించారు.
సార్స్ కోవ్-2 వైరస్ సోకిన తర్వాత శరీరంలోని రోగనిరోధక శక్తిలోని డెన్డ్రిటిక్ అనే కణాల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పనిచేయదు. దీని ఫలితంగా సదరు రోగి వైరస్ నుంచి కోలుకొన్నా.. సెకండరీ ఇన్ఫెక్షన్ల(అనుబంధ ఆరోగ్య సమస్య) బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరిగిపోతోంది.
ఏమిటీ డెన్డ్రిటిక్ కణాలు..?
డెన్డ్రిటిక్ కణాలు వ్యాధినిరోధక వ్యవస్థలో చాలా కీలకమైనవి. శరీరంలో ప్రవేశించే క్రిములకు వ్యతిరేకంగా వ్యాధినిరోధక స్పందనను ఇవే ప్రేరేపిస్తాయి. సహాయ టి కణాలను సచేతనం చేస్తాయి. ఇవి బి సెల్స్ యాంటీబాడీస్ను స్రవించి వైరస్ను చంపేలా చూస్తాయి.
ప్రొఫెసర్ క్రూగ్ బృందం మధ్యస్థ నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కొవిడ్ రోగులపై పరిశోధనలు చేసింది. మొత్తం 65 మంది రక్త నమూనాలు సేకరించి వాటిని విశ్లేషించింది. వీరి రక్తంలో డెన్డ్రిటిక్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, డెన్డ్రిటిక్ కణాలకు టి సెల్స్ను సచేతనం చేసే సామర్థ్యం కూడా తగ్గిన విషయాన్ని గమనించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?