ట్రంప్ మళ్లీ తలెత్తకుండా..
మామూలుగానైతే అమెరికాలో ఇది కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి, నూతన ప్రభుత్వం కొలువుదీరటం గురించి ఆలోచించాల్సిన సమయం.
భవిష్యత్లోనూ పోటీ చేయకుండా తీర్మానం!
మామూలుగానైతే అమెరికాలో ఇది కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి, నూతన ప్రభుత్వం కొలువుదీరటం గురించి ఆలోచించాల్సిన సమయం. కానీ అమెరికాలోని రాజకీయ, రాజ్యాంగ, న్యాయ కోవిదులంతా పాత అధ్యక్షుడిని శాశ్వతంగా ‘సాగనంపటం’ ఎలా అని ఆలోచిస్తున్నారు. జనవరి 20 వరకూ కూడా ఉంచకుండా ముందస్తుగానే అధ్యక్షుడు ట్రంప్ను పదవీచ్యుత్యుణ్ని చేయడానికున్న అవకాశాలతో పాటు... మునుముందు కూడా ట్రంప్ గోల లేకుండా చేయడమెలా అని కుస్తీ పడుతున్నారు. ఒకవేళ ఈసారి ముందస్తుగా దించేయలేకపోయినా... మళ్లీ ఎన్నడూ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఉండేలా చేయాలని (నిబంధనల ప్రకారం ట్రంప్ మరోమారు పోటీ చేసే అవకాశం ఉంది. 2024లో పోటీ చేసే ఆలోచన ఉందని కూడా ట్రంప్ తెలిపారు.) డెమొక్రాట్లు వ్యూహాలు రచిస్తున్నారు.
> రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈనెల 20 మధ్యాహ్నంతో ట్రంప్ పదవీకాలం ముగిసిపోతుంది. అదే రోజు కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ రెండ్రోజుల కిందట వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంలో జరిగిన అరాచకం నేపథ్యంలో- ట్రంప్ను అవమానకరరీతిలో సాగనంపాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. దీంతో ఆయనపై రెండోసారి అభిశంసన తీర్మానం చేసి (2019లో ఓసారి అభిశంసన తీర్మానం పెట్టారు. అది వీగిపోయింది.)గానీ, లేదంటే 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించిగానీ పదవి నుంచి పంపాలనుకుంటున్నారు.
> అభిశంసన చేయాలంటే అందుకు పెద్ద తతంగమే ఉంది. ప్రధానంగా ఇది రెండంచెల పద్ధతి.
> మొదట ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ చేస్తారు. అభిశంసన అనేది క్రిమినల్ కేసుతో సమానం. సాధారణ మద్దతుతో ఈ తీర్మానం ఆమోదం పొందితే దాన్ని సెనేట్కు పంపిస్తారు.
> అక్కడ కూడా దీనిపై వాదోపవాదాలు సాగుతాయి. అభిశంసన మేనేజర్లను నియమించి వాదనలు వింటారు. అధ్యక్షుడికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణను పరిశీలిస్తారు.
> సెనేట్లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.
> ప్రస్తుత సెనేట్ లెక్కల ప్రకారం- ఈ తీర్మానం నెగ్గాలంటే 17 మంది రిపబ్లికన్ సెనేటర్లు (ట్రంప్ పార్టీవాళ్లు) డెమొక్రాట్లకు మద్దతివ్వాల్సి ఉంటుంది. అది కాసింత కష్టసాధ్యమే!
> భవిష్యత్లో అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ట్రంప్ను నిషేధించే తీర్మానాన్ని సెనేట్ ఆమోదించే అవకాశాలు లేకపోలేదు. ఈ తీర్మానం నెగ్గటానికి సాధారణ మెజార్టీ చాలు.
> ఇది ఒకింత సాధ్యమయ్యేదిగానే కనిపిస్తోంది. డెమొక్రాట్లతో పాటు కొంతమంది రిపబ్లికన్లు కూడా ఈ తీర్మానానికి మద్దతివ్వొచ్చు. అందుకు రెండు కారణాలు. ఒకటి- ట్రంప్ను అభిశంసించటం కాకుండా భవిష్యత్లో పోటీ చేయకుండా నిషేధించటం; రెండోది- ట్రంప్పై నిషేధం విధిస్తే తమలో కొంతమందికి వచ్చేసారి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది.
> 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించటం కూడా అంత సులభమేమీ కాదు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, కేబినెట్ సభ్యులంతా అధ్యక్షుడి అసమర్థతను తెలుపుతూ సెనేట్కు లేఖ రాయాలి. దాన్ని సెనేట్ ఆమోదించాలి. ఇదంతా స్వల్పకాలంలో తేలేది కాదు.
> అభిశంసన కూడా అంత త్వరగా తేలేదిలా లేదు. అందుకే మధ్యేమార్గంగా ఇప్పుడు పదవిలోంచి తీసేసేట్లుగా కాకుండా భవిష్యత్లో ట్రంప్ మళ్లీ పోటీచేయకుండా నిషేధం విధించేలా అభిశంసన తీర్మానం చేయాలనేది ఆలోచన. దీనికి కూడా సమయం పడుతుంది. బహుశా జనవరి 20 దాటుతుంది.
> పదవిలోంచి దిగిపోయిన తర్వాతా అభిశంసన చేయొచ్చా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
> ఇందుకు అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు కొంతమంది వాదిస్తున్నారు. అధ్యక్షుడిని కాకున్నా ఉన్నత పదవిలో ఉన్నవారిపై పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన తీర్మానం నడిచిన సందర్భాన్ని వారు చూపిస్తున్నారు.
> 1876లో అప్పటి అధ్యక్షుడు యులిసిస్ దగ్గర పనిచేసిన రక్షణ, యుద్ధ వ్యవహారాల కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ కార్యదర్శి రాజీనామా చేశారు. అయినా ఆయనపై అభిశంసన తీర్మానం నడిచింది.
ట్రంప్ అభిశంసన విషయంలో డెమొక్రాట్ల పట్టుదల ఎంతమేరకు పనిచేస్తుందో చూడాలి. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు అభిశంసన ప్రక్రియ మొదలెట్టి... బైడెన్ అధ్యక్షుడయ్యాక దాన్ని కొనసాగించొచ్చు. అప్పుడు సెనేట్లోనూ డెమొక్రాట్లకు బలం పెరుగుతుంది. కాబట్టి అభిశంసన నెగ్గటానికి అవకాశాలుంటాయి. అలా ట్రంప్ను ప్రస్తుతానికి ఏమీ చేయలేకున్నా... భవిష్యత్లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా, మరే పదవిలోకిగానీ అడుగుపెట్టకుండా నిషేధం విధించే అవకాశం దొరుకుతుందనేది డెమొక్రాట్ల వ్యూహంగా కనిపిస్తోంది.
152 ఏళ్ల తర్వాత..
అమెరికా ప్రజాస్వామ్య చరిత్రపై ‘తనదైన’ ముద్ర వేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోతూపోతూ మరో భిన్నమైన పోకడకు తెరతీసి పోతున్నారు. అదే కొత్త అధ్యక్షుడు బైడెన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు అవుతున్నట్లు ప్రకటించడం. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి...పాత అధ్యక్షుడు రానంటూ సంప్రదాయాన్ని బహిరంగంగా తోసిపుచ్చటం 152 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుందంటున్నారు చరిత్రకారులు! రాకుండా ఉన్న సంఘటనలున్నాయిగాని... రానని ముందే చెప్పినతీరు మాత్రం చివరిసారిగా 1869లో జరిగిందంటున్నారు. అప్పట్లో యులిసెస్ గ్రాంట్ ప్రమాణం చేస్తుంటే... అక్కడికి రాకుండా పాత అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ శ్వేతసౌధంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఎవ్వరూ అలా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ‘ఘనత’ ట్రంప్కు దక్కబోతోంది. 1801లో జాన్ ఆడమ్స్, 1829లో క్విన్సీ ఆడమ్స్లు కూడా... కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. ప్రమాణానికి ముందే వారు వాషింగ్టన్ను వదిలి వెళ్లిపోయారు. ఈ అన్ని సందర్భాల్లోనూ వారిమధ్య వ్యక్తిగత వైరుధ్యాలు, రాజకీయ అహాలే కారణాలుగా చెబుతారు. 1921లోనూ అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ కొత్త అధ్యక్షుడు హార్డింగ్ ప్రమాణానికి రాలేదు. కారణం అనారోగ్యం. అయినా విల్సన్- హార్డింగ్తో కలసి కారులో క్యాపిటల్ భవనానికి వచ్చి వెళ్లారు. 1974లో గెరాల్డ్ ఫోర్డ్ ప్రమాణం చేస్తుంటే రాజీనామా చేసిన అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అక్కడ లేరు. తాజాగా ట్రంప్ తనదైన శైలిలో ముందే రానని తేల్చిచెప్పేశారు. మరోవైపు బైడెన్ కూడా... ‘‘ట్రంప్ రాకున్నా ఫర్వాలేదు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వస్తే చాలు. ఆయన రాకను ఎంతో గౌరవంగా భావిస్తా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.
ఈనాడు - ప్రత్యేక విభాగం
ఇవీ చదవండి..
బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న పెన్స్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్