Mahatma Gandhi: ‘మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పురస్కారం ఇవ్వాలి’
సత్యం, అహింసలే ఆయుధాలుగా భారత్కు స్వాతంత్ర్యం సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన మన జాతిపిత మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పౌరపురస్కారం ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ ప్రదానం చేయాలన...
అక్కడి చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టిన కరోలిన్ బి. మాలోనీ
వాషింగ్టన్: సత్యం, అహింసలే ఆయుధాలుగా భారత్కు స్వాతంత్ర్యం సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన మన జాతిపిత మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పౌరపురస్కారం ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్(మరణానంతరం)’ ప్రదానం చేయాలని అక్కడి ఓ ప్రముఖ చట్టసభ సభ్యుడు ప్రతిపాదించారు. ఈ మేరకు దిగువ సభ ‘ప్రతినిధుల సభ’లో తీర్మానాన్ని పునఃప్రవేశపెట్టారు. గాంధీ అనుసరించిన సత్యాగ్రహ మార్గం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ప్రముఖుల్లో స్ఫూర్తి నింపినట్లు గుర్తు చేశారు.
‘‘మహాత్మా గాంధీ అనుసరించిన ‘సత్యాగ్రహ’ నిరసన మార్గం యావత్తు ప్రపంచంలో స్ఫూర్తి నింపింది. ఇతరులకు సేవ చేయాలనే సత్కార్యంలో నిమగ్నులవ్వాలనే శక్తిని మనలో నింపుతుంది. వర్ణ సమానత్వం కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నుంచి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా వరకు ప్రతిఒక్కరినీ కదలించింది. ఓ ప్రజా ప్రతినిధిగా ఆయన ఆదర్శాల నుంచి నేను ప్రతిరోజు స్ఫూర్తి పొందుతున్నాను. ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పును మందు మనలోనే చూద్దామన్న గాంధీ మార్గదర్శకాలను ప్రతిఒక్కరం పాటిద్దాం’’ అని తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కరోలిన్ బి. మాలోనీ అన్నారు.
ఒకవేళ మహాత్మునికి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ను ప్రకటిస్తే.. భారత్ గడ్డపై పుట్టి ఈ గౌరవం పొందిన తొలి వ్యక్తి ఆయనే అవుతారు. జార్జ్ వాషింగ్టన్, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మదర్ థెరిసా, రోసా పార్క్స్.. ఈ అత్యున్నత పురస్కారం అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. భారత్కు స్వాతంత్ర్య సిద్ధించి 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా అమెరికా చట్టసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.