Omicron : ఒమిక్రాన్ భయం.. ఆంక్షల వలయంలోకి ప్రపంచ దేశాలు..!
కరోనా కోరల నుంచి బయటపడి దాదాపు అన్ని దేశాల్లోనూ సాధారణ పరిస్థితులు వచ్చేశాయని ఊపిరి పీల్చుకున్నాం. నాలుగైదు నెలలుగా అంతా సద్దుమణిగిందనుకునే లోపే తన ఉనికిని మహమ్మారి మరోసారి చాటుకుంది...
కరోనా కోరల నుంచి బయటపడి దాదాపు అన్ని దేశాల్లోనూ సాధారణ పరిస్థితులు వచ్చేశాయని ఊపిరి పీల్చుకున్నాం. నాలుగైదు నెలలుగా అంతా సద్దుమణిగిందనుకునే లోపే తన ఉనికిని మహమ్మారి మరోసారి చాటుకుంది. ఎప్పటిలాగే కొత్తరూపంలో మార్పు చెందుతూ.. ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ సెకెండ్ వేవ్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అంతకుముందు ఆల్ఫా, బీటా రకాలు వచ్చినా.. డెల్టా పెట్టిన తిప్పలు అవి పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఈ వేరియంట్.. దాదాపు 14 దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు క్రమంగా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి.
వారం రోజుల క్రితమే..
ఆల్ఫా పోయింది. డెల్టా డేంజర్ తొలగింది. ఇప్పుడు ఒమిక్రాన్ కథ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన ఈ వేరియంట్ గురించి ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే కరోనా గత వేరియంట్లు మిగిల్చిన చేదు అనుభవాల నుంచి అన్ని దేశాలూ ఇంకా తేరుకోలేదు. ఈ లోగా ఒమిక్రాన్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. దక్షిణాఫ్రికాలో తొలికేసు నమోదైన రెండు మూడు రోజుల్లోనే ఒమిక్రాన్ బాధిత దేశాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికమవుతోంది. అవి ఒమిక్రాన్ వల్లేనని ఇంకా నిర్ధరణ కాకపోయినా.. బాధితులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
మాస్కు నిబంధనలు మరింత కఠినం
బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయిల్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. ఫలితంగా అన్ని దేశాలూ అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ సహా పలుదేశాలు మాస్కుల వంటి నిబంధనల్ని కట్టుదిట్టం చేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. జపాన్లోనూ ఒమిక్రాన్ కేసు నమోదైంది. సరిహద్దులు మూసేస్తున్నామని ప్రకటించిన మరుసటి రోజే జపాన్లో తొలికేసు బయటపడింది. నమీబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి శాంపిళ్లను పరీక్షించగా.. ఒమిక్రాన్ రకం కేసుగా నిర్ధారణ అయ్యిందని జపాన్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోనూ ఈ తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించక ముందే.. తమ దేశంలోకి ఈ వేరియంట్ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్ వెల్లడించింది. ఈ నెల 24న ఒమిక్రాన్ గురించి డబ్ల్యూహెచ్వోకు దక్షిణాఫ్రికా చెప్పిందని అయితే, తమ దేశంలో ఈ నెల 19 నుంచి 23 తేదీల మధ్య తీసిన నమూనాల్లో ఈ వేరియంట్ను గుర్తించినట్లు నెదర్లాండ్స్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఒమిక్రాన్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు రెట్లు వేగంగా..!
ఈ వేరియంట్ మూలాలెక్కడ అనే విషయాన్ని పక్కన పెడితే.. ఆ ప్రభావం ఎలా ఉంటుందన్నదే చర్చకు వస్తున్న విషయం. ఈ నెల 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఒమిక్రాన్ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. జీనోమ్ సీక్వెన్స్ చేసి ఈ వేరియంట్ తీవ్రతను గుర్తించాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్ కన్నా ఆరురెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. ప్రభావిత దేశాల్లోని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో కూడా పదేపదే హెచ్చరిస్తూనే ఉంది. పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలు అందుబాటులోకి రాగానే వెల్లడిస్తామంటోంది. ఆందోళన చెంది కఠిన ఆంక్షలు విధించడం సరికాదని చెబుతోంది.
స్వల్ప లక్షణాలే..!
రోగ లక్షణాల విషయంలోనూ కొత్త వేరియంట్పై తీవ్ర ఆందోళన నెలకొంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన సమయంలో చాలా మంది బాధితుల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తాయి. కృత్రిమ ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలుపుకోవాల్సి వచ్చింది. కాగా, ఇప్పుడు ఒమిక్రాన్ ఎలాంటి లక్షణాలతో విరుచుకుపడుతుందోనన్న భయం మొదలైంది. దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యులు ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయని వారు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రకటన కాస్తో కూస్తో ఊరటనిస్తున్నా.. పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదన్నమాటే సర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వాటి ఫలితాలు వస్తేగానీ, వేరియంట్ ఎలా మ్యుటేట్ అవుతోందన్నది తెలిసేలా లేదు.
భారత్లోనూ మొదలైన ఆందోళన
భారత్లోనూ ఒమిక్రాన్ వేరియంట్పై ఆందోళన మొదలైంది. ఒక్కోరాష్ట్రం అప్రమత్తమవుతోంది. విదేశీ ప్రయాణికుల్ని గుర్తించడం, పరీక్షించడం లాంటి కట్టడి చర్యలు మళ్లీ ప్రారంభించారు. ఫస్ట్, సెకండ్వేవ్ సమయంలో మహారాష్ట్ర ఎలా వణికిపోయిందో కళ్లారా చూశాం. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఆ రాష్ట్రం జాగ్రత్తపడుతోంది. వేరియంట్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. వారం రోజుల్లో మూడుసార్లు కరోనా పరీక్షలు చేసి నెగెటివ్గా నిర్ధరించుకున్నాకే అనుమతించాలని నిర్ణయించింది. భారత్లో పలువురు వైద్యనిపుణులు ఈ వేరియంట్లో ఉత్పరివర్తనాలపై హెచ్చరికలు చేయడం అన్ని రాష్ట్రాలనూ కలవర పెడుతోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్గా భావిస్తున్న ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్లో 30కి పైగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు పలువురు చెబుతున్నారు. ఈ మ్యుటేషన్లే ప్రమాదకరంగా మారవచ్చన్న ఆందోళన నెలకొంది.
పరిశోధన సంస్థల అప్రమత్తం
కొవిడ్ కొత్త రకం ఒమిక్రాన్పై అధ్యయనం చేసేందుకు పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణలో అనుభవం కలిగిన సీసీఎంబీ మరోసారి కొవిడ్ జీనోం సీక్వెన్సింగ్పై దృష్టి పెట్టింది. మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన కేసుల్లో 5శాతం నమూనాలను వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణకు సీసీఎంబీ, సీడీఎఫ్డీ, హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి ల్యాబ్లకు పంపనున్నారు. ఇందులో అత్యధిక నమూనాలు సీసీఎంబీకి చేరుతున్నాయి. గత ఏడాది మే నుంచి సీసీఎంబీలో వైరస్ జన్యుక్రమ పరిశోధనలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!