30ఏళ్లుగా పోలీసు.. మీ వాళ్లని మీరే నమ్మట్లేదా?
తనపై జరుగుతున్న అన్ని విచారణలను మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ ముంబయి మాజీ కమిషనర్ పరమ్బీర్ సింగ్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం
పరమ్బీర్ సింగ్ పిటిషన్పై సుప్రీం ఆగ్రహం
దిల్లీ: తనపై జరుగుతున్న అన్ని విచారణలను మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ ముంబయి మాజీ కమిషనర్ పరమ్బీర్ సింగ్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 30ఏళ్లకు పైగా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి తన సొంత రాష్ట్ర పోలీసులనే నమ్మకపోవడం దిగ్భ్రాంతికరమని పేర్కొంది.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్.. పోలీసు అధికారి సచిన్ వాజేకు ప్రతి నెలా రూ.100కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరమ్ బీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన హోంగార్డ్ డీజీగా బదిలీ అయ్యారు. మరోవైపు ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. వీటికి సంబంధించిన విచారణలన్నింటినీ మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయాలని ,అంతేగాక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్.. పరమ్ బీర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ఇది చాలా షాకింగ్గా ఉంది. మహారాష్ట్ర రాష్ట్ర కేడర్కు చెందిన మీరు 30ఏళ్లకు పైగా ఇక్కడే సేవలందిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మీ సొంత రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని చెబుతున్నారు. మీ పోలీసు శాఖను మీరే అనుమానించడం సరికాదు. విచారణను బదిలీ చేయమని అడగకూడదు’’ అంటూ ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది.
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టు తర్వాత పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్.. వాజేకు నెలనెలా రూ.100 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. అంతేగాక.. తన ఆరోపణలపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే దీనిపై ముందు బాంబే హైకోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
ఆ తర్వాత బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలంటూ విచారణాధికారి తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ పరమ్బీర్ ఇటీవల ఆరోపించారు. కాగా.. అనిల్ దేశ్ముఖ్పై ఆరోపణల కేసుకు సంబంధించి విచారణతో పాటు మరో కేసులోనూ రాష్ట్ర పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ