గోరఖ్పూర్ ఘటన: వైద్యుడు కఫీల్ ఖాన్పై వేటు.. తప్పుబట్టిన కాంగ్రెస్
యూపీ గోరఖ్పూర్ బీఆర్డీ ఆసుపత్రిలోని చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విధుల నుంచి తొలగించింది.
లఖ్నవూ/ గోరఖ్పూర్: యూపీ గోరఖ్పూర్ బీఆర్డీ ఆసుపత్రిలోని చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఆక్సిజన్ అందక 70 మంది చిన్నారులు మృత్యువాత పడిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 2017లోనే ఆయనను సస్పెండ్ చేయగా.. తాజాగా పూర్తిగా విధుల నుంచి తప్పించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అలోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇంతకంటే పూర్తి వివరాలు ఇవ్వలేకపోతున్నట్లు పేర్కొన్నారు.
తనను తొలగించినట్లు వచ్చిన వార్తలపై కఫీల్ ఖాన్ స్పందించారు. బీఆర్డీ మెడికల్ కాలేజీ నుంచి తనను తొలగించినట్లు అలోక్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని, ఉత్తర్వులు ఇంకా తనకు చేరలేదని తెలిపారు. అయినా, తనను తొలగించే అధికారం వారికి లేదని, యూపీపీఎస్సీ (యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని చెప్పారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కేసులో తనతో పాటు 8 మందిని సస్పెండ్ చేయగా.. ఏడుగురిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని చెప్పారు. విధుల్లో అలసత్వం, అవినీతి వంటి ఆరోపణలపై తనకు కోర్టు క్లీన్చిట్ ఇచ్చినా తనను విధుల నుంచి పూర్తిగా తొలగించారని చెప్పారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, ఒకసారి ఉత్తర్వులు తన చేతికొచ్చాక కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కఫీల్ఖాన్ను తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం స్పందించారు. వైద్యుడిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని పేర్కొన్నారు. కఫీల్ ఖాన్ చేసే న్యాయపోరాటంలో కాంగ్రెస్ పార్టీ అతడికి అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.