Taliban: తాలిబన్.. ఆ హత్యలు ఆపండి..!
అఫ్గానిస్థాన్ పౌర ప్రభుత్వం హాయంలో పనిచేసిన భద్రతా సిబ్బందిని తాలిబన్లు వేటాడి చంపడాన్ని వెంటనే ఆపేయాలని 22 దేశాలు డిమాండ్ చేశాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించాయి.
ఇంటర్నెట్డెస్క్: అఫ్గానిస్థాన్ పౌర ప్రభుత్వం హయాంలో పనిచేసిన భద్రతా సిబ్బందిని తాలిబన్లు వేటాడి చంపడాన్ని వెంటనే ఆపేయాలని 22 దేశాలు డిమాండ్ చేశాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించాయి. ‘‘వేటాడి మరీ హత్యలు చేయడాలు, వ్యక్తుల అదృశ్యాలపై అఫ్గానిస్థాన్ నుంచి వస్తున్న నివేదికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి’’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య సహా మరో 19 దేశాలు సంతకాలు చేశాయి. ది హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక బహిర్గతం చేసిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం. ఈ సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 100కుపైగా అపహరణలు, హత్యలు జరిగినట్లు సమాచారం.
ఈ ప్రకటనపై తాలిబన్ ప్రతినిధి ఇనాముల్లా సమాంఘనీ న్యూయార్క్ టైమ్స్ వద్ద స్పందించారు. కొన్ని చోట్ల తాలిబన్ ఫైటర్లు పాత కక్షలు తీర్చుకోవడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకానీ, హత్యలు, అపహరణలు తాలిబన్ల విధానం కాదని తెలిపారు. తాము క్షమాభిక్షకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇటువంటి హత్యలు ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రయోజనాలకు భంగకరమని వెల్లడించారు.
అమ్నెస్టి సంస్థ అక్టోబర్లో విడుదల చేసిన ఓ నివేదికలో కూడా ఇటువంటి హత్యలను వెల్లడించింది. ఆగస్టు 30వ తేదీన 300 తాలిబన్లు ధానీ ఖుల్ గ్రామంపై దాడి చేశారు. ఇక్కడ ప్రభుత్వ బలగాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఇక్కడ తాలిబన్లకు లొంగిపోయిన దాదాపు 9 మంది ప్రభుత్వ సైనికులను హత్య చేశారు. మరో ఇద్దరు కాల్పుల్లో చనిపోయారు. ఈ క్రమంలో 17 ఏళ్ల బాలిక కూడా ప్రాణాలు కోల్పోయింది.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.