Tamil nadu: సామాన్యుడి జేబుకు ఊరట.. పెట్రోల్‌పై ₹ 3 తగ్గింపు

ఎన్నడూ లేని స్థాయిలో పెరిగిన చమురు ధరలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్న వేళ తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నును ₹3 మేర తగ్గించింది.

Published : 13 Aug 2021 15:27 IST

చెన్నై: ఎన్నడూ లేని స్థాయిలో పెరిగిన చమురు ధరలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్న వేళ తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నును ₹3 మేర తగ్గించింది. ఏప్రిల్‌లో కొలువుదీరిన స్టాలిన్‌ ప్రభుత్వం.. శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది. డీజిల్‌పై మాత్రం ఎలాంటి ఊరటా ఇవ్వలేదు.

తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఏటా ₹ 1,160 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది. ప్రస్తుతం చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.102 ఉండగా.. డీజిల్‌ ధర రూ.94.39 ఉంది. ఆగస్టు 14 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పన్నులు తగ్గించేలా ఈ నిర్ణయం ప్రభావితం చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు సహా 19 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర ఇప్పటికే సెంచరీ దాటింది.

పెట్రోల్‌పై పన్ను తగ్గించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా పలు కీలక నిర్ణయాలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మాతృత్వ సెలవులను 9 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్‌ వంటి పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు