Air India: వంతెన కింద ఇరుక్కున్న పాత విమానం

సేవల నుంచి తొలగించి, తుక్కు కింద విక్రయించిన ఎయిరిండియా విమానం ఒకటి జాతీయ

Updated : 04 Oct 2021 20:10 IST

తుక్కు కింద ఎప్పుడో విక్రయించామన్న ఎయిరిండియా

దిల్లీ: సేవల నుంచి తొలగించి, తుక్కు కింద విక్రయించిన ఎయిరిండియా విమానం ఒకటి జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో వంతెన కింద ఇరుక్కుంది. శనివారం రహదారి మార్గంలో దీనిని తరలిస్తుండగా ఘటన సంభవించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం సామాజిక అనుసంధాన వేదికల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. వంతెన కింద ఇర్కున్న విమానాన్ని ఎయిరిండియా సేవల నుంచి గతంలోనే తొలగించామని, తక్కు కింద విక్రయించామని తెలిపారు. ‘‘విమానాన్ని కొనుకున్న వారు శనివారం దీనిని తరలిస్తున్నారు. ఎయిరిండియాకు విమానంతో ఎలాంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని