International flights: తొందరపడొద్దు.. అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆలోచించండి
దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. అలాగే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
అధికారులకు మోదీ సూచన
దిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. అలాగే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అధికారులతో పలు అంశాలపై చర్చించారని పీఎంఓ వెల్లడించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికను పున:సమీక్షించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు.
అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునః ప్రారంభించే అంశంపై శుక్రవారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి రద్దు చేసిన అంతర్జాతీయ విమాన కమర్షియల్ పాసింజర్ సర్వీసుల్ని డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరించనున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పాటు విదేశాంగ, ఆరోగ్య శాఖలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఏ తెలిపింది. అయితే, యూకే, సింగపూర్, చైనా, బ్రెజిల్, బంగ్లాదేశ్, మారిషస్, జింబాబ్వే, న్యూజిలాండ్తో పాటు కొవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపుతున్న దేశాలైన దక్షిణాఫ్రికా, బోట్స్వానా, ఇజ్రాయిల్, హాంకాంగ్ వంటి మొత్తం 14 దేశాలకు మాత్రం పరిమితమైన సేవలు కొనసాగించనున్నట్టు పేర్కొంది. మరోపక్క భారత్ ఇప్పటికే పర్యాటక వీసాల జారీ ప్రక్రియను కూడా ప్రారంభించింది.
ఆ ప్రకటనపై మరోసారి ఆలోచించాలి: మోదీ
ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఈ ప్రకటనపై మోదీ మాట్లాడారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షల సడలింపు గురించి మరోసారి ఆలోచించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ వేరియంట్ను కట్టడిచేసే ఉద్దేశంతో బ్రిటన్ ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్, యూఎస్కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు ఈయూ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి. మనదేశంలో కూడా పలు రాష్ట్రాలు ఈ దిశగా ఆలోచన చేశాయి. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థన చేశారు. కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి తక్షణమే విమానాల రాకపోకలను నిలిపివేయాలని ట్విటర్ వేదికగా కోరారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు క్వారంటైన్ విధిస్తున్నట్లు నగర మేయర్ కిశోరీ పెడ్నేకర్ ప్రకటించారు.
జీనోమ్ సీక్వెన్సింగ్ను విస్తృతం చేయాలి..
కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి పలు కొవిడ్ నియమాలను పాటించాలని ఈ సమావేశంలో ప్రధాని సూచించారు. ప్రమాదం పొంచి ఉన్న దేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల్ని పరీక్షించాలని తెలిపారు. కరోనా వైరస్లో ఉత్పరివర్తనాలను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ గురించి అధికారులు మోదీకి వివరించారు. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రక్రియను మరింత విస్తృతం చేయాలని ప్రధాని వారికి సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ చర్యలు అమలు చేయాలని, నిఘా పెంచాలని వెల్లడించారు. ఇప్పటికే కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు ఇచ్చేలా చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్