Omicron Fear: ఆఫ్రికా నుంచి ముంబయికి 1000మంది.. ఆచూకీ మాత్రం 466మందిదే!
గడిచిన 15 రోజుల్లో ఆఫ్రికా దేశాల నుంచి ముంబయికి దాదాపు వెయ్యి మంది ప్రయాణికులు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించాయి.
వంద మంది నమూనాలు మాత్రమే సేకరించామన్న బీఎంసీ
ముంబయి: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్తో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో గడిచిన 15 రోజుల్లో ఆఫ్రికా దేశాల నుంచి ముంబయికి దాదాపు వెయ్యి మంది ప్రయాణికులు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించాయి. అయితే, వారిలో ఇప్పటివరకు సగం మందిని మాత్రమే కనిపెట్టామని వెల్లడించారు. వీరిలో కేవలం 100 మంది నుంచి మాత్రమే ఇప్పటివరకు కొవిడ్ నిర్ధారణ కోసం శాంపిళ్లను అధికారులు సేకరించడం ఆందోళన కలిగిస్తోంది.
ఆఫ్రికా దేశాల నుంచి గడిచిన 15 రోజుల్లోనే దాదాపు వెయ్యి మంది ముంబయికి వచ్చినట్లు విమానాశ్రయశాఖ అధికారులు బృహన్ ముంబయి మునిసిపల్ అధికారులకు తెలియజేశారు. అనంతరం అందులో కేవలం 466 ప్రయాణికుల సమాచారాన్ని మాత్రమే బీఎంసీ అధికారులకు అందించారు. విమానాశ్రయ అధికారులు ఇచ్చిన ప్రయాణికుల వివరాల్లో ఇప్పటివరకు 100 మంది నుంచి కొవిడ్ నిర్ధారణ కోసం నమూనాలు సేకరించినట్లు బీఎంసీ అధికారి సురేష్ కాకాని వెల్లడించారు. వీటి ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వస్తాయని.. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిస్తామని తెలిపారు. అయితే, వెయ్యి మంది ప్రయాణికుల్లో కేవలం 466 మంది సమాచారం మాత్రమే లభ్యం కావడం.. మిగతా ప్రయాణికులు వివరాలు తెలియకపోవడంపై అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలాఉంటే, ప్రమాదకరంగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పొంచి వున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దేశాలను ‘రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆయా దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిస్క్ జాబితాలోని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించడంతోపాటు వారిని ఐసోలేషన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.